వైరల్: ఒక్క కొడుకు ఉన్నవారికి సంక్రాంతి కీడు.. క్యూ కట్టిన మహిళలు..!!

Divya
ఏడాది సంక్రాంతి పండుగ ఒక కీడుతో వచ్చిందని ఒక్క కుమారుడు ఉన్న ఆడవాళ్లు ఇద్దరు కొడుకులు ఉన్న ఆడవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఐదు రకాల గాజులను సైతం తమ చేతికి తోడిగించుకోవాలని లేకపోతే ఉన్నటువంటి ఆ ఒక్క కొడుకుకు కీడు వస్తుందంటూ పలు రకాల మెసేజ్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ప్రతి ఒక్కరు సైన్స్ పరంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఈ రోజుల్లో ఇలాంటి వింత ఆచారాలు మూఢనమ్మకాలు కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి

సంక్రాంతి పండుగ రాబోతున్న వేళ ఇలాంటి న్యూస్ వైరల్ గా మారుతోంది.. దీంతో చాలామంది ఆడవాళ్లు సైతం పల్లెల నుంచి పట్నం వరకు ఈ న్యూస్ ను వ్యాప్తి చెందిస్తున్నారు.. అంతేకాకుండా ఆడవాళ్లు సైతం ఎగబడి మరి పలు రకాల గాజులు కొనడానికి మక్కువ చూపుతున్నారు.. ఇలాంటి న్యూస్ ను కూడా సోషల్ మీడియా లో షేర్ చేస్తూ పలు రకాల పోస్టులు వైరల్ గా చేస్తున్నారు.. అయితే ఇక్కడ మాత్రం ఎక్కువగా ఇద్దరు కుమారులు ఉన్నవారికి పెద్ద దెబ్బ పడేలా కనిపిస్తోంది. ఎందుకంటే గాజులకు డబ్బులు అడిగేందుకు వచ్చిన ఆడవారిని సైతం కాదని పంపించ లేరు కనుక

అలాగని వచ్చిన వారందరికీ ఇస్తూపోతూ ఉంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ వింత ఆచారం వల్ల చాలామంది విద్యావంతుల సైతం ఫైర్ అవుతున్నారు..ప్రస్తుతం ఉన్న ఆధునిక యుగంలో ఇలాంటి వాటిని ప్రోత్సహించడం ఎంత మేరకు మంచిది అంటూ మండిపడుతున్నారు. గడిచిన సంవత్సరం లో సంక్రాంతి.. ఉగాది పండుగలకు వదిన మరదలు గాజులు అన్నదమ్ములు కడకలు.. ఆడపరచులకు చీరలు ఆడబిడ్డలకు కుంకుమ భరిణులు వంటివి చేయాలంటూ న్యూస్ వైరల్ గా మారాయి.. ఇలాంటి వాటి వల్ల వ్యాపారస్తులు లబ్ధి పొందుతున్నారు తప్ప ఎలాంటి వారికి ఉపయోగపడలేదని చెప్పవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: