బడ్జెట్-2023 : సామాన్యులకు ఊరుట కలగనుందా..!!

Divya
ఈరోజు నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడుతున్నది. అయితే ముఖ్యంగా పన్ను విషయంలో పలు చర్చలు కూడా జరుగుతున్నాయి కేంద్ర బడ్జెట్ను సమర్పించినప్పుడల్లా ఆదాయ పనులు స్లాబ్ గురించి పలు చర్చలు జరుగుతూనే ఉన్నాయి.. ఆదాయ పన్ను అంటే మన ఆదాయం పైన విధించే పన్ను అని చెప్పవచ్చు. కానీ ఆదాయపు పన్ను స్లాబ్ అంటే కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఈసారి ఈ స్లాబ్ గురించి మనం ఒకసారి తెలుసుకుందాం.

ఆదాయాల స్లాబ్ తయారుచేసిన విధంగా ప్రజలు పన్ను చెల్లిస్తారు. ముఖ్యంగా ఆదాయ పనులు పరిధిలో ఉండే వేతన ఉద్యోగులు ఈ బడ్జెట్ పైనే ఆశలు పెట్టుకున్నారు పన్ను మినహాయింపు కల్పించిన తమపై భారం తగ్గిస్తారని వారు కూడా ఆశిస్తున్నారు. మధ్యతరగతి వేతన ఉద్యోగులతో పాటు అధిక ఆదాయ గ్రూపులు పరిధిలో ఉన్న వారు కూడా ఈ స్లాబ్ లో మార్పులు ఉంటాయని తెలుస్తోంది. భారతదేశంలో సుమారుగా 8 కోట్లకు మందికిపైగా ఆదాయ పనులు చెల్లిస్తున్నారు. ఇక ఇదే సమయంలో జీఎస్టీ కొన్ని రకాల సర్చ్ చార్జీల రూపంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల నుంచి పరోక్షంగా పన్నులను వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

పన్ను స్లాబ్ ల ద్వారా ఆదాయాన్ని నిర్ణయిస్తారు. దీని ఆధారంగానే ఆదాయ పనులను చెల్లించాల్సి ఉంటుంది.పన్ను స్లాబ్ పెరుగుతున్న కొద్దీ విదేశీ పన్ను కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం దేశంలో రెండు రకాల పన్ను వ్యవస్థలు ఉన్నాయి.. ఒకటి కొత్త పన్ను స్లాబ్ మరొకటి పాత పన్ను స్లాబ్. గత బడ్జెట్లలో ఎక్కువగా పాత పన్ను స్లాబులను రద్దు చేయడం జరిగింది.
పాత పన్ను స్లాబ్ ప్రకారం మీ ఆదాయం రూ.2.5 లక్షలు ఉంటే మీరు ఎలాంటి పనులు చెల్లించాల్సిన అవసరం లేదు.. ఒకవేళ రూ.2.5 నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయం ఉంటే 5 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. రూ.5 నుంచి రూ.7.5 లక్షల వరకు ఉంటే 10 శాతం పన్ను చెల్లించాలి.. సీనియర్ సిటిజెన్లకు రూ .5లక్షల వరకు ఆదాయం  ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: