"నా భర్తను శిక్షించాలి".. టీవి నటి మైథిలి వైరల్ కామెంట్స్!

Purushottham Vinay
తన భర్త శ్రీధర్ రెడ్డికి పెళ్లికి ముందు నుంచే మహా అలియాస్ రజిత అనే అమ్మాయితో సంబంధం ఉందని ఇంకా ఆమె విషయంలో తనను భర్త తరచూ కొట్టేవాడని ఆరోపించింది టీవీ నటి మైథిలీ రెడ్డి.తనను మోసం చేసిన భర్తను చాలా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. రెండు రోజుల క్రితం టీవీ నటి మైథిలీ రెడ్డి ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి అందరికి కూడా తెలిసిందే. తన ఆత్మహత్యాయత్నం గురించి పంజాగుట్ట పోలీసులకు ఆమె సమాచారం ఇవ్వడంతో, ఆమె ఇంటికి చేరుకున్న పోలీసులు ఇక మైథిలిని ఆసుపత్రికి తీసుకెళ్లారు.ఇక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మైథిలి.. తన ఆత్మహత్యకు గల కారణాలను వివరించింది.


''మాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. నా భర్త శ్రీధర్ రెడ్డి టీవీలో ఒక ప్రోగ్రాం డైరెక్టర్. ఇద్దరికీ కూడా సెకండ్ మ్యారేజ్. అప్పటికే నాకు ఒక బాబు కూడా ఉన్నాడు. పెళ్లికి ముందు మంచి వాడిలా నటించాడు. ఇక మనకి పిల్లలు వద్దు.. ఈ బాబునే సొంత కొడుకులా చూసుకుంటా అన్నాడు. పెళ్లైన కొద్ది నెలల్లోనే తన అసలు రంగు బయటపెట్టాడు. కట్నం డబ్బు, కార్లు ఇంకా బంగారం.. ఇలా ప్రతి విషయంలోనూ తను అబద్ధాలే చెప్పాడు. 65 తులాల బంగారం కూడా దొంగతనం చేశాడు. ఇక తనకు పెళ్లికి ముందే రజిత అనే యువతితో సంబంధం ఉంది. ఆమెను ఒకసారి ఫ్రెండ్ అనేవాడు.. ఇంకోసారి అయితే చుట్టాలమ్మాయి అనేవాడు. ఈ విషయంలో ఇద్దరిమధ్యా బాగా గొడవలు కూడా జరిగాయి. ఆమె విషయంలో నన్ను బాగా కొట్టేవాడు. ఆమె చాలాసార్లు ఇంటికొచ్చి మా ఇద్దరిమధ్య గొడవలు కూడా పెట్టేది. దీంతో తనపై మోతె పోలీస్ స్టేషన్‌లో 498 సెక్షన్ కింద కేసు కూడా పెట్టాము. 2021లో పంజాగుట్టలో ఇంకో కేసు కూడా పెట్టా. అయితే, పంజాగుట్ట పోలీస్‌లు ఈ విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు.


శ్రీధర్ రెడ్డికి పీసీసీ మహిళా అధ్యక్షురాలు సునీత రావు సపోర్ట్ కూడా ఉంది. భర్తే నన్ను బాగా మోసం చేసాడు. ఇక దాదాపు రెండేళ్లుగా ఆయన నాతో ఉండట్లేదు. నాకు తెలీకుండానే విడాకులకు కూడా అప్లై చేసాడు. పిల్లలు ఉన్నారని ఇన్ని రోజులు నేను అన్నీ భరించాను. నాకు ఇక మానసికంగా ధైర్యం  అనేది సరిపోలేదు. ఆ బాధను తట్టుకోలేకే పంజాగుట్ట పోలీసులకు నేను కాల్ చేశాను. ఆ తర్వాత సూసైడ్ అటెంప్ట్‌ చేశాను. నాకు ఇప్పుడు తగిన న్యాయం కావాలి. నన్ను మోసం చేసిన నా భర్తను శిక్షించాలి'' అని మైథిలి చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: