అయ్యో పాపం.. కొద్ది గంటల్లో పెళ్ళి.. అంతలోనే విషాదం..
ఇప్పుడు పెళ్ళిలో అలాంటి ప్రమాదం జరిగింది. మరి కొద్ది గంటల్లో పెళ్ళి జరుగుతుంది అనగా డ్యాన్స్ చేస్తూ పెళ్ళి కొడుకు మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.పెళ్ళి కొడుకు చని పోవడంతో కళ్యాణ మండపం లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషాద ఘటన గుజరాత్లోని సూరత్లో చోటు చేసుకుంది.తమ వివాహ వేడుకను జీవితాంతం మరిచిపోలేని విధంగా ఉండేందుకు వధూవరులు ప్రయత్నిస్తుంటారు..ఆనందోత్సహాల మధ్య కళకళలాడుతున్న పెళ్లింటి విషాదం నెలకొన్నది..
పెళ్ళిని ఘనంగా చేయాలనీ పెళ్ళి కొడుకు అన్నీ గ్రాండ్ గా కొన్నాడు.భొజనాల దగ్గర నుంచి డెకరేషన్ వరకూ అన్నీ దగ్గరుండి తనే స్వయంగా చూసుకున్నాడు. పెళ్ళిలో గట్టిగా మ్యూజిక్ ను కూడా పెట్టించాడు.పెళ్లి వేడుకలో డీజే పాటలకు డ్యాన్స్ చేస్తూ వరుడు కుప్పకూలాడు. ఫ్రెండ్స్తో కలిసి ఆటపాటలతో సందడి చేస్తున్న సమయంలో గుండెపోటుతో మరణించాడు. పెళ్లికి కొద్ది గంటల ముందే ఈ విషాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మితేష్లో ఎలాంటి కదలిక లేకపోవడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు కంగారుపడ్డారు. హుటాహుటిన బైక్పై అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది.అతను చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.