వైరల్ వీడియో : ఢిల్లీ వీధుల్లో పడవ ప్రయాణం?
ఇక ఇదే అదునుగా భావిస్తూ ఉంటాయ్ ప్రతిపక్ష పార్టీలు. వరదలు వచ్చిన సమయంలో ఆ వరదలను ఉద్దేశిస్తూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే కేవలం విమర్శలతో సరిపెట్టుకోకుండా వినూత్నంగా ప్రజల ఇబ్బందులను తెలియజేసేందుకు నిరసనను తెలుపడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ ఒక బీజేపీ నేత చేసిన నిరసన కాస్త అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది అని చెప్పాలి. సాధారణంగా పడవ ప్రయాణం చేయాలి అంటే ఎక్కువగా పర్యాటక ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టపడుతూ ఉంటారు అందరు. కానీ ఇక్కడ బిజెపి నేత మాత్రం రహదారిపై నిలిచిపోయిన వరద నీటిలో పడవ ప్రయాణం చేసి నిరసన తెలిపారు.
దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం నెట్టింట్లో హాల్ చల్ చేస్తూ ఎంతోమందిని అవాక్కయ్యేలా చేస్తుంది. దేశ రాజధాని ఢిల్లీ లో భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయిపోయాయి ఈ క్రమంలోనే వరదలపై బీజేపీ నేత తజిందర్ పాల్ సింగ్ వినూత్నమైన నిరసన తెలిపి హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఢిల్లీ వీధుల్లో భారీగా నిలిచిపోయిన వరద నీటిపై పడవ ప్రయాణం చేశారు. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పడవ ప్రయాణం కోసం నేను రిషికేశ్ వెళ్దాం అని అనుకున్నా.. కానీ లాక్ డౌన్ కారణంగా వెళ్ళలేకపోయాను.. ఇక ఇప్పుడు ఏకంగా ఢిల్లీలోనే పడవ ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించారు. థాంక్యూ కేజ్రీవాల్ జీ అంటూ ఆయన విమర్శలు గుప్పించారు.