వరుడు చెంప చెళ్లుమనిపించిన వధువు...

Purushottham Vinay
పెళ్లిళ్లు జరుగుతున్న సందర్భాల్లో కొన్నిసార్లు చిన్న చిన్న గొడవలు అనేవి తలెత్తుతుంటాయి. సాధారణంగా చుట్టాల మధ్య వివాదాలు తలెత్తుతుంటాయి. ఇక ఇలాంటి సమయాల్లో చాలాసార్లు విషయాలు సర్దుకొని రెండు వైపుల వారు శాంతిస్తారు. మరికొన్ని సార్లయితే వివాదం పెద్దదవుతుంది.ఇక ఈమధ్య కాలంలో వరుడు, వధువు మధ్యే గొడవలు జరుగుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్లోనూ ఇలాంటి ఓ ఘటన జరిగింది. ఓ కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకును చెంపదెబ్బ కొట్టింది. దీంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ తిన్నారు. పెళ్లయ్యిన తరువాత అత్తారింటికి వెళ్లేందుకు కారు దిగిన వెంటనే వరుడి చెంపచెళ్లుమనిపించింది ఆ అమ్మాయి. ఆ తర్వాత వెంటనే పెళ్లి బట్టలు మార్చేసి మామూలు బట్టలు వేసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. జౌన్పూర్ జిల్లా లవాయన్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది.
ఇక ఈ ఘటన రెండు కుటుంబాల పెద్దలకు తెలియడంతో పంచాయితీ పోలీసుల దగ్గరికి వెళ్లింది. వారికి సర్దిచెప్పేందుకు పోలీసులు కూడా ట్రై చేశారు.అయినా కాని ఫలితం లేకపోయింది. అయితే పెళ్లికి ముందు వరుడి లవ్ ఎఫైర్ నడిచిందని, అది తెలిసిన పెళ్లి కూతురు అతడిని కొట్టినట్టు మొదటి విచారణతో తేలిందని పోలీసులు చెప్పారు. ఇక రిసెప్షన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే ఈ వివాదం జరిగిందని వెల్లడించారు. ఇక వరుడిని వధువు కొట్టిందన్న వార్త తీవ్రంగా వ్యాపించింది.పెళ్లి కోసం పెళ్లి కొడుకు ఇంటికి పెళ్లి కూతురు బృందం వచ్చిన సమయంలో ఎలాంటి గొడవ జరగలేదు. పెళ్లి కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. అప్పటి వరకు అమ్మాయితో పెళ్లి కొడుకు కూడా ఏం చెప్పలేదు.ఆ తర్వాత అప్పగింతల సమయంలో ఈ బాగోతం జరిగింది. కొత్త పెళ్లి కూతురు..పెళ్లి కొడుకుని కొట్టింది. దీంతో అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. చివరికి వారు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: