వైరల్ : సోషల్ మీడియాలో తెగ తెగ ట్రోల్ అవుతున్న మిఠాయి కొట్టు చిట్టెమ్మ సీరియల్......
ఈ సీరియల్లో హీరో పైలట్. అతడికి తెలియకుండా నిశ్చితార్థం జరిపేందుకు ప్లాన్ చేస్తారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులంతా అతడు నడుపుతున్న విమానమే ఎక్కుతారు. పైలట్(హీరో)ను ప్యాసింజర్ క్యాబిన్లోకి పిలిపించుకుని మరీ సర్ప్రైజ్ చేస్తారు. ఇంట్లో నేల మీద కూర్చున్నట్లే ఆ విమానంలో పూజారితో సహా అతడి కుటుంబ సభ్యులు కింద కూర్చొని నిశ్చితార్థం జరిపిస్తారు. విమానంలో కూర్చీలు ఏమయ్యాయని ప్రశ్నించవద్దు. ఎందుకంటే.. ఇది డైలీ సిరియల్.. ఇందులో లాజిక్కులు వెతికితే బుర్ర పాడవ్వడం ఖాయం. ప్రస్తుతం ఈ సీరియల్ మీమర్స్ కి స్టఫ్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ సీరియల్ మీద మీమ్స్ క్రియేట్ చేస్తూ తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్..ఇక చాలా వైరల్ కూడా అవుతుంది. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన వైరల్ న్యూస్ ల గురించి తెలుసుకోండి....