ఇప్పుడున్న యుగం టెక్నాలజీ యుగం. ఇప్పుడు టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతలా అంటే మన జీవితాల్ని కూడా తారు మారు చేసి మార్చేంతలా చెసింది. ఈ ఆధునిక యుగంలో చాలా మంది దగ్గర స్మార్ట్ ఫోన్స్, లాప్టాప్స్ తో పాటు స్మార్ట్ వాచ్ కూడా నిత్యావసరంగా మారిపోయింది. స్మార్ట్ వాచ్ కూడా ఇప్పుడు వున్న టెక్నాలజీలో చెప్పుకోదగ్గ భాగమే.ఇక ఇప్పుడు ఈ టెక్నాలజీ ఓ వ్యక్తిని తన ప్రియురాలి వద్ద అడ్డంగా బుక్ చేసింది. నదియా ఎసెక్స్ అనే టిక్టాక్ యూజర్ తన ప్రియుడు చేసిన ఘన కార్యం గురించి వివరించింది. ఆ స్మార్వాచ్ లేకపోతే.. ఈ విషయం తనకు తెలియకపోదునని పేర్కొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘నా బాయ్ఫ్రెండ్ ఓ రాత్రంతా నైట్అవుట్ చేశాడు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో 500 క్యాలరీలో ఖర్చు చేశాడు. ఈ విషయం నాకు ‘ఫిట్బిట్’ స్మార్ట్ వాచ్ ద్వారా తెలిసింది. మా ఇద్దరి స్మార్ట్వాచ్లు ఒకదాన్ని ఒకటి అనుసంధించుకున్నాం. అందువల్ల అతడి ఫిట్నెస్కు సంబంధించిన సమాచారం మెసేజ్ ద్వారా నాకు అందుతుంది’’ అని తెలిపింది.‘‘ఉదయం నిద్రలేచిన తర్వాత ఈ సమాచారం చూసి షాకయ్యా. అర్ధరాత్రి 500 క్యాలరీలు ఖర్చు చేసేంత పని అతడు ఏం చేశాడనే అనుమానం కలిగింది. అతడు నన్ను చీటింగ్ చేశాడని అర్థమైంది’’ అని తెలిపింది.
దీని తర్వాత ఆమె తన బాయ్ఫ్రెండ్కు బ్రేకప్ చెప్పేసింది. చూశారుగా.. స్మార్ట్వాచ్ ఎంత పనిచేసిందో. ఇంతకీ అతడు అర్ధరాత్రి 500 క్యాలరీలు ఎలా ఖర్చు చేశాడో మీకు అర్థమైందా? ఆమె మాత్రం అతడు వేరే యువతితో కలిసి ఆ ‘పని’ చేయడం వల్లే అంత ఖర్చయ్యి ఉంటుందని భావించి బ్రేకప్ చెప్పేసింది.లాజిక్ ని బట్టి చూస్తే అతని ఖచ్చితంగా ఆ పనే చేసాడని అర్ధమైపోతుంది. కాబట్టి మిత్రులారా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడున్న టెక్నాలజీ కూడా మన తప్పుల్ని బయటపెడుతుంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో వైరల్ విషయాలు గురించి తెలుసుకోండి...