Viral Video: రీల్స్ కోసం నెమలిపై రాక్షస చర్యలు?

Purushottham Vinay
మధ్యప్రదేశ్‌లోని కట్నీ నుండి షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది.వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక దుర్మార్గుడు క్రూరమైన రీతిలో నెమలి ఈకలను పీకేయటం కనిపిస్తుంది. ఈ యువకుడు చేస్తున్న పనిని చూసిన నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి వైరల్ వీడియోలో ఉన్న ఆ ఎదవని గుర్తించి అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అయితే ఆ నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.నెట్టింటా వైరల్‌గా మారిన వీడియోలో, ఒకడు కనికరం లేకుండా నెమలిని హింసిస్తున్నాడు. ఇంకా అంతేకాదు అతని చుట్టూ నెమలి ఈకలు కుప్పగా పడి ఉండటం కూడా వీడియోలో కనిపిస్తోంది. ఆ నిందితుడు ఏకంగా కెమెరా వైపు చూపిస్తూ నవ్వుతూ రాక్షసానందం పొందుతున్నాడు. 


ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో ఈ కిరాతక చర్యకు పాల్పడిన యువకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.ఈ వైరల్ వీడియో ఆధారంగా యువకుడిని అటవీశాఖ గుర్తించింది. వాడి పేరు అతుల్ కొహనేగా గుర్తించారు.ఇక ఈ వీడియోను అతుల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రీల్‌గా అప్‌లోడ్ చేశాడు. వ్యూస్‌ కోసమే ఇలా చేశాడని తేలింది. ఆ తర్వాత ఆ నెమలిని చంపేసి వండుకు తిన్నాడంటూ కూడా కొందరు ఆరోపిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు చెప్పారు. ఈ వైరల్ వీడియోలో కనిపించిన బైక్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా వాడిని గుర్తించారు. వాడిపై వన్యప్రాణి చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ వీడియో 20 నుండి 25 రోజుల పాతదని తెలిసింది.. నిందితుడు కట్ని జిల్లాలోని రేతి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్నాడు. గత 20 రోజులుగా ఇంటి నుండి పరారీలో ఉన్నట్టుగా తెలిసింది.నిందితుడి కోసం పోలీసు టీం విస్తృతంగా గాలిస్తున్నట్టుగా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: