ఎన్నికల వేళ.. గుంజీలు తీసిన ఎమ్మెల్యే.. ఎందుకో తెలుసా?

praveen
ఎన్నికల వచ్చాయంటే చాలు రాజకీయ నాయకులందరూ కూడా ప్రజల్లో వాలి పోతూ ఉంటారు. ఎన్నికలకు ముందు వరకు ప్రజల ముందుకు రావడానికే ఇష్టపడనివారు. ఇక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిందంటే చాలు ఇంటింటికి తిరుగుతూ ఓటు వేయాలంటూ అభ్యర్థిస్తూ ఉంటారు. అంతే కాకుండా ఓటర్లను ఆకర్షించడానికి చిత్రవిచిత్రమైన పనులు చూస్తూ ఉంటారూ. కొన్ని కొన్ని సార్లు రాజకీయ నాయకులు చేసే పనులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. ఎక్కువగా అయితే ఊహించని రేంజిలో హామీలు కురిపించడం.. మాటలతోనే అభివృద్ధిని కళ్లకు కట్టినట్లుగా చూపించడం చేసి ఇక తమ వైపుకు ఓటర్లను తిప్పుకుంటూ ఉంటారు.

 కానీ మరి కొంత మంది రాజకీయ నాయకులు మాత్రం కాస్త కొత్తగా విచిత్రంగా ప్రయత్నించి  ఓటర్ల మనసులో చోటు దక్కించుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఇకపోతే మరికొన్ని రోజుల్లో ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం అన్ని పార్టీల అభ్యర్థులు కూడా ప్రచారం చేస్తున్నారు. ఇక గెలుపే లక్ష్యంగా అన్నీ పార్టీలు వ్యూహాలను అమలు చేస్తూ పావులు కదుపుతున్నాయ్. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని గద్దె దించాలని అటు ఇటు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా నడుం బిగించాయి అని చెప్పాలి. ఇక మరో సారి ఉత్తరప్రదేశ్లో విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాలని యోగి ఆదిత్యనాథ్ సిద్ధమయ్యారు.

 ఇకపోతే ఇటీవలే ఓటర్లను మెప్పించడానికి బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. గత ఐదేళ్లలో తాను తప్పులు చేసి ఉంటే క్షమించాలని యూపీలోని రాబర్ట్స్ గంజ్ బిజెపి ఎమ్మెల్యే భూపేష్ చౌబే గుంజీళ్లు తీసారూ. అంతేకాకుండా తనకు మరోసారి అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. దీంతో అక్కడున్న పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అరుపులు చప్పట్లతో  భూపేష్ చౌబె కి మద్దతు ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: