పెళ్లి నుంచి వరుడు పరార్.. వధువు ఏం చేసిందంటే?

Purushottham Vinay
ఇక ఒక పెళ్లి అంగరంగ వైభవంగా జరగబోతుంది.ఊరేగింపుల నడుమ వరుడు పెళ్లి మండపానికి వచ్చాడు. ఆ తర్వాత పెళ్లి పీటల మీద కూర్చున్నాడు.పధ్ధతిగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు దండలు కూడా మార్చుకోవటం జరిగింది.ఇక తాళి కట్టడమే ఆలస్యం అనుకున్న సమయంలో వరుడు పీటల మీద నుంచి వెళ్లి పోయాడు.బట్టలు మార్చుకోడానికి వెళ్లాడేమోనని అంతా అనుకున్నారు. అయితే, వరుడు అతడి గదిలో కూడా లేడు. ముహూర్తం ముంచుకొస్తున్నా వరుడి ఆచూకీ తెలియరాలేదు. చివరికి అతడు పెళ్లి నుంచి పరార్ అయ్యాడని తెలుసుకుని వధువు కుటుంబికులు షాకయ్యారు. అయితే, పెళ్లి మాత్రం ఆగలేదు.సుఖాంతంగా జరిగింది.

ఇక ఇది ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగింది. ఇక సాంప్రదాయం ప్రకారం పెళ్లిలో వరమాల కార్యక్రమం ముందుగా జరుగుతుంది. వధువరులు దండలు మార్చుకున్న తర్వాతే అసలైన తాళి కట్టడం మొదలవుతుంది. అయితే, వరుడు వరమాల కార్యక్రమం తర్వాత మళ్లీ కనిపించలేదు. ఇరువురి కుటుంబాలు అతడి కోసం వెతికినా ఫలితం లేకపోయింది. చివరికి అతడు పెళ్లి ఇష్టం లేక మధ్యలోనే వెళ్లిపోయాడని తెలుసుకుని వధువు కుటుంబికులు ఆందోళనకు గురయ్యారు.మధ్యలో పెళ్లి ఆగిపోతే పరువు పోతుందని భావించిన వధువు కుటుంబికులు ఎలాగైనా సరే పెళ్లి జరగాలని భావించారు. దీంతో పెళ్ళిలో పాల్గొన్న యువకుల్లో ఒకరిని ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా వధువు బంధువులు ఇక ‘స్వయంవరం’ నిర్వహించారు. చివరికి వారికి నచ్చిన ఒక అబ్బాయిని ఎంపిక చేసుకున్నారు. ఆ అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడారు. అబ్బాయి చుట్టాలు కూడా అంగీకారం తెలపడంతో నిర్ణయించిన ముహూర్తానికే పెళ్లి జరిగి కథ సుఖాంతం అయ్యింది.

ఇక ఆ తరువాత పెళ్లి కూతురు తల్లి దండ్రులు ఊరుకుంటారా  ఆ వెంటనే పారిపోయిన వరుడు, అతడి తల్లిదండ్రులపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై నర్వాల్ ఇన్స్‌పెక్టర్ శేష్ నారాయన్ పాండే మాట్లాడుతూ.. ‘‘మాకు వధువు కుటుంబికుల నుంచే కాకుండా వరుడి ఫ్యామిలీ నుంచి ఫిర్యాదులు అందాయి. వరుడి కుటుంబికులపై చర్యలు తీసుకోవాలని వధువు కుటుంబికులు ఫిర్యాదు చేశారు. కనిపించకుండా పోయిన తన కొడుకును వెతికేందుకు సాయం చేయాలని వరుడి తండ్రి ధరమ్‌పాల్ ఫిర్యాదు చేశాడు’’ అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: