బుల్లి పిట్ట: ఈ కాలంలో ఫ్రిడ్జ్ టెంపరేచర్ ఎంత ఉంటే మంచిది..!!

Divya
ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇళ్లల్లో కూడా రిఫ్రిజిరేటర్ అనేది కచ్చితంగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఇందు లోనే మనం వండుకున్న తర్వాత మిగిలిన ఆహార పదార్థాలు అన్నిటిని కూడా ఉంచుతాము..వీటిని ఏళ్ల తరబడి ఉపయోగిస్తున్నప్పటికీ అందుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు మాత్రం చాలా మందికి తెలియకపోవచ్చు.. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే రిఫ్రిజిరేటర్ సరైన ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి ముఖ్యంగా మారుతున్న వాతావరణానికి అనుగుణంగానే ఇందులోని టెంపరేచర్ను ఉంచాల్సి ఉంటుందట.. అయితే కొన్నిసార్లు ఈ విషయాన్ని సైతం ప్రజలు మర్చిపోతూ ఉంటారు. నిజానికి బయట వాతావరణం మార్పుతో ఫ్రిడ్జ్ లోని ఉష్ణోగ్రత కూడా మారుతూ ఉంటుంది.
దీని కారణంగానే ఆహార పదార్థాలు కూడా తాజాగా ఉంటాయి. ఫ్రిడ్జ్ లోపల ఉష్ణోగ్రత సరిగ్గా సెట్ చేయకపోతే నిల్వ చేసిన ఆహార పదార్థాలు చెడిపోవడానికి కారణాలు అవుతాయి. ప్రస్తుతం అధునాతన రిఫ్రిజిరేటర్ల ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఇందులో సీజన్ల వారిగా గుర్తులను కూడా ఫ్రిడ్జ్ కంపెనీల సైతం ఇస్తూ ఉంటాయి .కానీ మీ ఫ్రిజ్లో అలాంటి మోడ్ లేదా మార్కింగ్ లేకపోతే శీతాకాలంలో ఫ్రిడ్జ్ ని ఎలాంటి ఉష్ణోగ్రతలో ఉంచాలని విషయం తెలుసుకోవాలి..

ముఖ్యంగా శీతాకాలం లో రిఫ్రిజిరేటర్ ను 1.7 నుంచి 3.3 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండేలా చూడాలి.. దీని వల్ల ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆహారం పాడవకుండా ఉండడమే కాకుండా విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుంది. దీనివల్ల కరెంటు బిల్లు కూడా మనం ఆదా చేసుకోవచ్చు. ఇలా ఏ కాలంలో అయితే ఆ కాలానికి అనుగుణంగా ఉష్ణోగ్రతను బట్టి రిఫ్రిజిరేటర్ టెంపరేచర్ ని మారుచు కుంటూ ఉండటం వల్ల ఫ్రిడ్జ్ ఎక్కువ కాలం మన్నిక రవడమే కాకుండా ఎలాంటి రిపేర్లు కూడా ఉండవు.. మరి ఎవరికైనా ఈ విషయం తెలియ కపోతే వెంటనే అప్రమత్తమయి మీ రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రతను మార్చుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: