చౌక ధరలో మార్కెట్లో అదిరిపోయే ఈ-స్కూటర్?

ఇండియాలో టూ వీలర్స్ వాడకం బాగా పెరుగుతుంది.అయితే పెరిగిన ఈ పెట్రోల్‌ ధరల నేపథ్యంలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు జనాలు మొగ్గు చూపుతున్నారు.వీటికి పెరిగిన అనూహ్య డిమాండ్‌కు అనుగుణంగా చాలా కంపెనీలు కూడా కొత్త మోడల్స్‌ ఈవీలను మార్కెట్‌లోకి రిలీజ్‌ చేస్తున్నాయి. స్టార్టప్‌ కంపెనీల నుంచి టాప్‌ ఎండ్‌ కంపెనీల దాకా కొత్త ఈవీలను మార్కెట్‌లోకి రిలీజ్‌ చేస్తున్నాయి. తాజాగా ఎవోలెట్ పోనీ అనే ఈవీ కంపెనీ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇంకా ఈ స్కూటర్లు రెండు మోడల్స్‌లో అందుబాటులో ఉన్నాయి.ఇండియాలో బేస్‌ మోడల్‌ పోనీ ధర రూ. 41,124గా ఉంటే, హై మోడల్ ధర రూ. 55,799గా ఉంది. ఎవోలెట్ పోనీ మోటారు 250 వాట్స్‌ కరెంటుని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎవోలెట్ పోనీలో ఫ్రంట్ డిస్క్, వెనుక డ్రమ్ బ్రేక్‌లు ఇంకా అలాగే ఎలక్ట్రానిక్ అసిస్టెడ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి. ఈ స్కూటర్‌ ఇతర ఫీచర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఈ పోనీ ఈజెడ్‌ ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 80 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇంకా అదే సమయంలో క్లాసిక్ వేరియంట్‌ ఒక్కసారి పూర్తి ఛార్జింగ్‌తో మొత్తం 120 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. రెండింటి మాక్సిమం స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు ఉంటుంది. స్కూటర్ సీటు ఎత్తు మొత్తం 800 మిమీ ఉంటుంది. ఇంకా అలా కాకుండా ప్రామాణిక ఛార్జర్‌తో బ్యాటరీని 4 నుండి 5 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు.ఈవోలెట్‌ పోనీ  కొలతల పరంగా కంపెనీ  అతి చిన్న ఈ-స్కూటర్. ఈ స్కూటర్ 250 వాట్ల పవర్ అవుట్‌పుట్‌తో వాటర్‌ప్రూఫ్ బీఎల్‌డీసీ మోటార్‌కు శక్తినిచ్చే లిథియం అయాన్ బ్యాటరీని కలిగి ఉంది. ఇక పోలో పోనీ రెండు మోడళ్లలో అందుబాటులో ఉంది. ఈ పోలో పోనీ ఈజెడ్‌ 48వీ/24ఏహెచ్‌ వీఆర్‌ఎల్‌ఏ బ్యాటరీతో వస్తుంది. అలాగే 48వీ/24ఏహెచ్‌ లిథియం అయాన్ బ్యాటరీతో పోలో పోనీ క్లాసిక్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఎవోలెట్ పోనీని లీడ్-యాసిడ్ బ్యాటరీతో రావడంతో ఎక్కువ మంది కొనుగోలు చేస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: