బుల్లి పిట్ట:రూ. 11 వేలకే 5-G స్మార్ట్ మొబైల్..!!

Divya
ఈ మధ్యకాలంలో టెక్ దిగ్గజ సంస్థలు అన్నీ కూడా సరికొత్త రకాలైన మొబైల్స్ ని తయారు చేయడం జరుగుతోంది. ఈ మధ్యనే సరికొత్త వేరేయంట్ గల ఫైవ్ జి మొబైల్స్ ని పలు రకాల సంస్థలు అధికారికంగా ప్రకటిస్తున్నారు. ఇప్పుడు తాజాగా దేశీయ కంపెనీ లావా తన బ్లెజ్ 5-G మొబైల్ సరికొత్త వేరియంటులో తీసుకురాబోతున్నది.6GB RAM+128GB స్టోరేజ్ వేరేటి గల మొబైల్ ని విడుదల చేయడం జరుగుతోంది. ఇక ఈ మొబైల్ అసలు ధర రూ.11,999 వేరియంట్ లో లాంచ్ అయినట్లుగా తెలుస్తోంది.

ఇక ఈ మొబైల్ ఆఫర్లో భాగంగా రూ.11,499 రూపాయలకి అందు బాటులోకి కలదు. అలాగే పలు బ్యాంకు కార్డుల లావా దేవీల పైన కూడా పలు ఆఫర్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. లావా అధికారికంగా స్టోర్లు ఈ కామర్స్ సైట్స్ ద్వారా ఈనెల 16వ తేదీ నుంచి ఈ స్మార్ట్ మొబైల్ కొనుగోలు చేసుకోవచ్చట. దీని బ్యాక్ సైడ్ గ్లాస్ గ్రీన్ గ్లాస్ బ్లూ కలర్లలో లభిస్తుందట. లావా బ్లేజ్ 5-G స్మార్ట్ మొబైల్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. ఈ మొబైల్ 6.5 అంగుళాల హెచ్డి డిస్ప్లే తో పాటు..90HZ రిఫ్రెష్ రెట్ కలదు.
స్మార్ట్ ఆండ్రాయిడ్ 12 అవుట్ ఫీట్ ఆధారంగా ఈ మొబైల్ పనిచేస్తుంది. 6 జిబి రామ్.. 128 జీబీ మెమొరీ కలదు.. బ్యాక్ సైడ్ 50 ఎంపీ త్రిబుల్ కెమెరా సెటప్ కూడా కలదు. సెల్ఫీ ప్రియుల కోసం 8 మెగాపిక్సల్ కెమెరాను అందించనున్నారు. ఇక ఈ మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే..5000 MAH సామర్థ్యంతో కలదు. ఇక అది తక్కువ ధరకే 5జి మొబైల్ కొనాలనుకునే కస్టమర్లకు ఇది ఒక చక్కటి శుభవార్త వంటిదని చెప్పవచ్చు. మరి ఏ మేరకు ఈ స్మార్ట్ మొబైల్ కస్టమర్లను ఆకట్టుకుంటుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: