పెరిగిన మారుతీ కార్ల ధరలు..

మీరు మారుతి కారు కొనాలని ఆలోచిస్తున్నారా?ఇక మరోసారి బడ్జెట్‌ను పెంచాల్సి ఉంటుంది. ఇన్‌పుట్ ధరలో నిరంతర పెరుగుదల కారణంగా  సెప్టెంబర్ నెల నుండి అన్ని మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ తెలిపడం జరిగింది. ఇక గత సంవత్సరంలో వివిధ ఇన్‌పుట్ వ్యయాలు పెరగడం వల్ల దాని వాహనాల ధర ప్రతికూలంగా ప్రభావితమవుతోందని కంపెనీ ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొనడం జరిగింది. ఒక సంవత్సరంలో ఇలా మారుతి కార్ల ధరలు పెరగడం అనేది ఇది నాలుగోసారి కావడం గమనార్హం.ఇక ఇన్‌పుట్ వ్యయం మొత్తం భారాన్ని కంపెనీ భరించదు. కనుక ఇది కొంత భాగాన్ని మారుతి వినియోగదారుల జేబుల పైకి కూడా నెట్టేస్తోంది. అయితే మారుతి కంపెనీ అన్ని మోడళ్లను ఖరీదైనదిగా చేయడం మాత్రం ఖాయంగా తెలుస్తుంది. కార్ల ధరలు ఎంత పెరుగుతాయో అనేది మాత్రం ఇంకా కంపెనీ స్పష్టం చేయలేదు.

 ప్రస్తుతం మారుతీ కంపెనీ ఎంట్రీ లెవల్ కారు ఆల్టో నుండి హై ఎండ్ కార్ల వరకూ ఎక్స్-షోరూమ్ ధరలు వచ్చేసి రూ. 2.99 లక్షల నుండి రూ .12.39 లక్షల వరకు ఉన్నాయి.ఇక మారుతి కంపెనీ ఈ సంవత్సరం తన కార్ల ధరలను పెంచడం ఇది మొదటిసారి మాత్రమే కాదు. ఇది ఇప్పటికే ఏకంగా మూడుసార్లు ధరలను పెంచడం జరిగింది. ఇక ఈసారి ధరలు అనేవి పెరిగితే అది నాలుగోసారి కాబోతున్నది. అలాగే జనవరిలో మొదటగా ఈ మారుతి కంపెనీ కార్ల ధరలను రూ .34,000 వరకు పెంచడం జరిగింది. ఏప్రిల్‌ నెలలో, కొన్ని మోడళ్లను రూ. 22,500 వరకు పెంచడం జరిగింది.ఇక దీని తరువాత, జూలై నెలలో, మారుతి కంపెనీ ధరలను మరోసారి పెంచడం జరిగింది. అలాగే ఇప్పుడు మరోసారి ఈ మారుతి కార్లు ఖరీదైనవి కానున్నాయి.వాహనాల ధరల పెరుగుదల కారణంగా అలాగే ముడి పదార్థాల ధర పెరుగుదల కారణంగా ఇంకా వాహనాన్ని తయారుచేసే ఖర్చు కూడా పెరుగుతోందని మారుతి కంపెనీ చెబుతోంది. ముఖ్యంగా స్టీల్ ధరలు కూడా ఇప్పుడు పెరుగుతున్నాయి. గత సంవత్సర కాలంలో స్టీల్ ధరలు మొత్తం కూడా 50 శాతం పెరిగడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: