ఈ రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రూపాయిని ప్రారంభించనున్నారు. మన సెల్ఫోన్ కు ఈ రూపాయి క్యూఆర్ కోడ్ మరియు మెసేజ్ రూపంలో స్ప్రింగు వోచర్ ఉంటుంది. మనం ముందుగానే వోచర్లు కొనుగోలు చేసి వాటిని వారు చూపించిన సేవలకే వినియోగించాలి. పలు కేంద్ర శాఖ యొక్క సహకారంతో మరియు భారత జాతీయ చెల్లింపు సంస్థా చొరవతో ప్రజెంట్ 8 బ్యాంకులతో యొక్క సేవలు అందించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ ఒక్క రూపాయి ఎలక్ట్రానిక్ రూపంలో ఉండి మనకు ఈరోజు నుంచి అందుబాటులోకి రానున్నది. దీనిని ప్రధాని ఎంతో ఆర్భాటంగా ప్రారంభించనున్నారు. కార్డులు, బ్యాంకు ఖాతాలు, యాప్స్ తో సంబంధం లేకుండా, కాంటాక్ట్ లెస్, నగదు రహిత లావాదేవీలు చేసుకునేందుకు ఈ యొక్క విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రూపిని ఏ యొక్క ఉద్దేశం కోసం తీసుకుంటారో..
ఆ తీసుకున్న దానికోసం మాత్రమే ఖర్చు చేయాలి. ఇతర ఏ విధమైన చెల్లింపులో కూడా పనికిరాదు. అయితే ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందజేస్తున్న నగదును ఈ రూపీ పరిధిలోకి తెచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. దీని ద్వారా దుర్వినియోగాన్ని ఆపవచ్చని ఇది కేంద్రం యొక్క అభిప్రాయం. ఉదాహరణకు ఫర్టిలైజర్ షాపుల్లో యజమానులు సబ్సిడీని తగ్గించి ఎరువులు రైతులకు అందిస్తున్నారు. కానీ ఇక నుంచి రైతులకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ నేరుగా రైతుల మొబైల్ ఫోన్లకు ఈ రూపి ఓ చర్ల రూపంలో వచ్చే అవకాశాలున్నాయని, ఈ వచ్చిన ఓచర్ల ను మళ్లీ కొనుగోలు చేసి చెల్లించొచ్చు.
**ఈ రూపి అంటే ఏమిటి**
ఈ రూపాయి అనేది వినియోగదారునికి సెల్ ఫోన్ కి క్యూఆర్ కోడ్ రూపంలో లేదా ఎస్ఎంఎస్ వోచర్ రూపంలో వస్తుంది. ఈ రూపీ ఎలాంటి ప్లాట్ ఫామ్ కాదు అని చెప్పవచ్చు. ఇందులో థర్డ్ పార్టీ యొక్క పేమెంటు ప్రమేయం ఉండదు. వోచర్లు లేదా ఈ కోడ్ ను ఉపయోగించి లబ్ధిదారులు నెట్ బ్యాంకింగ్ గాని, డిజిటల్ పేమెంట్ గాని, యాప్ లతో సంబంధం లేకుండా వారి యొక్క డబ్బును బదులుగా వినియోగించుకోవచ్చని తెలియజేసింది. ఈ రూపీలో కేంద్ర ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ సహకారం ఎంతో ఉందని చెప్పవచ్చు. దీనిలో వచ్చే స్ట్రింగ్ ఓచర్ ను, ఎస్ఎంఎస్ రూపంలో గాని వచ్చే వోచర్ ను వ్యాపార సంస్థల దగ్గర రీడిం చేసుకునే సదుపాయం ఉంది. ఆరోగ్యానికి సంబంధించిన మందులు, టీవీ కార్యక్రమంలో, మందులు, ఎరువుల కొనుగోలు మాతా శిశు సంరక్షణ వంటి వాటికి సంబంధించి నగదు బదిలీ రూపంలో మనకు సబ్సిడీ కూడా లభిస్తుంది. వీటిని తొలిదశలోనే ఈ యొక్క ఈ రూపిని ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. కార్పొరేట్ సంస్థలు కూడా ఉద్యోగుల సంరక్షణకు ఈ రూపి ఓచర్ లను జారీ చేయవచ్చని కేంద్రం తెలిపింది. ముఖ్యంగా వ్యాక్సిన్ కు సంబంధించి తమ ఉద్యోగస్తులకు ఈ రూపిని గిఫ్ట్ గా ఇవ్వవచ్చని తెలియజేసింది. ఇప్పటికే ఐ సి ఐ సి ఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, యాక్సెస్, ఎస్బిఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ , బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా వంటి బ్యాంకులతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయి.