షియోమీ 48 మెగాపిక్సల్ కొత్త స్మార్ట్ఫోన్!
మొబైల్స్ తయారీదారు షియోమీ 48 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరా కలిగిన రెడ్మీ స్మార్ట్ఫోన్ను ఈ నెల 10వ తేదీన విడుదల చేయనుంది. ఈ కెమెరాకు 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ను అందిస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 10న 'రెడ్ మీ ప్రో 2' పేరిట చైనాలో లాంచ్ చేయనున్నట్లు షియోమీ ప్రెసిడెంట్ లిన్ బిన్ తెలిపారు.
ఈ ఫోన్ పూర్తి ఫీచర్లని సంస్థ అధికారికంగా ప్రకటించనప్పటికీ ఈ ఫోన్ లో వర్టికల్ కెమెరాతో పాటు ఎల్ఈడీ ఫ్లాష్, వెనక భాగంలో రెండు కెమెరాలు ఉండనున్నట్లు లిన్ బిన్ షేర్ చేసిన ఫోటోని బట్టి తెలుస్తోంది. ఇక ఈ ఫోన్లో స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ ఉండనున్నట్లు సమాచారం.
మరోవైపు హానర్ కూడా ఇప్పటికే వీ20 స్మార్ట్ఫోన్ను 48 మెగాపిక్సల్ కెమెరాతో గత వారం విడుదల చేసింది. దీంతో ఈ ఫోన్కు, షియోమీ విడుదల చేయబోయే ఫోన్కు మధ్య పోటీ ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.