టీవీ: విడాకుల బాట పట్టిన కిరాక్ ఆర్పి.. అసలు కథ ఇదే..!

Divya
జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన  కమెడియన్లలో కిరాక్ ఆర్పి కూడా ఒకరు.. ఆ తర్వాత పెద్దారెడ్డి చేపల పులుసు అనే బిజినెస్ స్టార్ట్ చేసి మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు..2024 ఎన్నికలలో భాగంగా వైసిపి పార్టీ పైన నిప్పులు చేరుకుతూ రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నారు. ఒకవైపు వ్యాపారంలో బిజీగా ఉంటూనే పొలిటికల్ పరంగా కూడా ఏదో ఒక విషయంలో హైలెట్ అవ్వాలని ప్రయత్నిస్తూ ఉన్నారు కిరాక్ ఆర్పి. అయితే తాజాగా కిరాక్ ఆర్పీ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
జబర్దస్త్ కార్యక్రమంలో పాల్గొంటున్న సమయంలో అక్కడ లక్ష్మీ ప్రసన్న అనే అమ్మాయిని ఆర్పి కి పరిచయమయ్యారట. మొదటి చూపులనే ఆమె అంటే ఇష్టపడడంతో కొద్దిరోజుల తర్వాత తన ప్రేమ విషయాన్ని కూడా ఆమెకు చెప్పి మరి ఒప్పించారట. అయితే ఈమెకు ఇదివరకే కూడా బాయ్ ఫ్రెండ్ ఉన్నారని.. అతడు బేకారిగా తిరుగుతూ ఉండేవాడని..  దీంతో చివరికి ఆర్పి ప్రేమ వ్యవహారాన్ని చెప్పడంతో లక్ష్మీ ప్రసన్న ఓకే చెప్పినట్లు సమాచారం.. అలా 2023లో నవంబర్ 29న వివాహం చేసుకున్నారు ఈ జంట.
అలా వివాహమైన కొద్ది రోజులకే జబర్దస్త్ నుంచి దూరమైన కిరాక్ ఆర్పి తన భార్య తెచ్చిన కట్నంతో పెద్దారెడ్డి చేపల పులుసు పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా బిజినెస్ వల్ల పాపులారిటీ సంపాదించుకోవడంతో పొలిటికల్ వైపుగా అడుగులు వేసిన కిరాక్ ఆర్పి ఎక్కువగా బిజినెస్, రాజకీయాలలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండడం వల్ల తన భార్యకు సమయాన్ని కేటాయించలేకపోతున్నారట.. కానీ కిరాక్ ఆర్పి భార్యకు పిల్లలు అంటే ఇష్టమని రాజకీయ గొడవలలో తల దూర్చడం వల్ల తన భార్యకు దూరమవుతున్నారట. ఈ క్రమంలోనే కిరాక్ ఆర్పి భార్య లక్ష్మీ ప్రసన్న తన పాత బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతూ ఉండడాన్ని చూసిన కిరాక్  ఆర్పీ ఈ విషయాన్ని జీర్ణించుకోలేక గుర్తుచప్పుడు కాకుండా  విడాకులు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియాల్సి ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: