టీవీ: వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి బిగ్ బాస్ బ్యూటీ.. ఇక రచ్చ రచ్చెనా..!

Divya
బిగ్బాస్-8 వ సీజన్ ప్రస్తుతం ఆశించిన స్థాయిలో ఆడియోస్ని ఆకట్టుకోలేకపోతోంది. ముఖ్యంగా హౌస్ లోకి వెళ్ళిన వారు ఎవరూ కూడా ప్రేక్షకులకు తెలియకపోవడంతో గత సీజన్ కంటే దారుణంగా రేటింగ్ ని అందుకోవడమే కాకుండా ప్రేక్షకులు విసిగిపోయేలా కంటెస్టెంట్స్ ఇందులో కొన్ని పనులు చేస్తున్నారు. అయితే బిగ్బాస్ సీజన్-8 మొదలులోనే ఒక సరికొత్త ప్లాన్ ని అమలు చేయబోతున్నట్లు తెలియజేశారు. అదేమిటంటే గత సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్లను ఈసారి కూడా హౌస్ లోకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.

అయితే ఇందులో కొంతమంది పేర్లు ఫైనల్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాంటి వారిని వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వడానికి నలుగురు కంటెస్టెంట్లను ఎంపిక చేసినట్లు సమాచారం.. అందులో మొదట రోహిణి పేరు వినిపించగా ఆ తర్వాత నయని పావని, శోభా శెట్టి, ముక్కు అవినాష్ పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు మరొక పేరు వినిపిస్తోంది.. రతికా రోజు కూడా సీజన్-8 లోకి  ఎంట్రీ ఇస్తుందేమో అనే టాక్ వినిపిస్తోంది. ఈమె గత సీజన్ లో కూడా హౌస్ లో పల్లవి ప్రశాంతతో ముందు పులిహోర కలిపి.. చివరికి అతనితోనే మళ్లీ గొడవ పెట్టుకుంది.

అలా హౌస్ లో ఉన్న వారందరితో కూడా రతికా రోజ్ గొడవలు పడుతూ ఉండడంతో చివరికి ఎలిమెంట్ అయ్యే కూడా బయటికి వచ్చేసింది. తిరిగి మళ్లీ ఈవెన్ హౌస్ లోకి పంపించిన ఫైనల్ వరకు వెళ్లలేకపోయింది. ప్రస్తుతం అయితే సినిమాలలో బిజీగా ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అక్కడ కూడా ఈమె ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోతున్నట్లు సమాచారం.. ఇప్పుడు మరొకసారి బిగ్ బాస్-8 సీజన్లో ఎంట్రీ ఇవ్వబోతుందని తెలిసి.. ఆమె అభిమానులు బిగ్ బాస్ ప్రేక్షకులు సైతం రతికా హౌస్ లోకి వస్తే .. ఇక రచ్చ రచ్చే ఉంటుంది అంటూ పలువురు నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి ఇమే ఎంట్రీ ఇస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: