టీవీ: రేవ్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన రీతూ చౌదరి..!

Divya
మొదట పలు సీరియల్స్ లో నటించి ఆ తర్వాత జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఫిమేల్ కమెడియన్గా పేరుపొందింది యంగ్ బ్యూటీ రీతూ చౌదరి.. ముఖ్యంగా సుధీర్ హైపర్ ఆది ఇతరత్రా కమెడియన్ల స్కిట్లు ఎక్కువగా కనిపిస్తూ ఉండేది.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ గ్లామర్ ఫోటోలను వీడియోలనే కాకుండా పలు విషయాలను కూడా పంచుకుంటూ ఉండేది. ప్రస్తుతం రీతూ చౌదరి దావత్ అనే షోకి హోస్టుగా వ్యవహరిస్తున్నది. అయితే ఇందులో సెలబ్రిటీలను ఎప్పుడు విభిన్నమైన ప్రశ్నలను అడుగుతూ ఉంటుంది.

అప్పుడప్పుడు బోల్డ్ ప్రశ్నలు కూడా అడుగుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది రీతూ చౌదరి. రీసెంట్గా ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాలో నటించింది. ముఖ్యంగా గత కొద్ది రోజుల నుంచి సినీ పరిశ్రమను కుదిపేస్తున్న రేవ్ పార్టీ పైన స్పందిస్తూ రీతూ చౌదరి ఇలా మాట్లాడింది.. రేవ్ పార్టీ గురించి రీతు చౌదరి ఫన్నీగా చేసిన ఈ వాక్యాలు వైరల్ గా మారుతున్నాయి. గతంలో తాను రేవు పార్టీకి తనను కూడా ఇన్వైట్ చేస్తే బాగుంటుంది అనుకునేదాన్ని ఎందుకంటే రేవ్ పార్టీ ఏంటో అసలు తనకు తెలియదని వెల్లడించింది.

అయితే అది కూడా సాధారణంగా ఎంజాయ్ చేసే పార్టీ అనుకుంటున్నాను కానీ ఇప్పుడు రేవ్ పార్టీ గురించి తీసుకుంటే పలు షాకింగ్ విషయాలు వినిపిస్తున్నాయని రేవు పార్టీ అంటే ఇంత ఉంటుందా అనుకున్నానని తెలిపింది. అయితే డ్రగ్స్ లాంటి వ్యవహారాలు కూడా అక్కడ వినిపిస్తున్నాయి.. చాలామంది ఇంకా చాలా రకాల చెడు విషయాలు చెబుతున్నారని తెలిపింది రీతూ చౌదరి. అయితే ఇప్పుడిప్పుడే ఇవన్నీ తెలుస్తున్నాయని కూడా తెలిపింది. ఇంతలా తెలుసుకున్న తర్వాత అసలు ఇలాంటి పార్టీలకు వెళ్లకపోవడంనే మంచిదని నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. ఒకవేళ డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోతే మనమల్ని మనం సమర్థించుకోవడమే అది తప్పే అవుతుంది అంటూ తెలిపింది. ఇటీవలే హేమ పేరు కూడా బెంగళూరులో జరిగిన రేవు పార్టీలో పేరు వినిపించింది ఆమెను హాజరు కావాలని పోలీసులు కూడా నోటీసులు పంపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: