టీవీ: ఒకప్పుడు వెండితెర..ఇప్పుడు బుల్లితెర.. క్రేజ్ మామూలుగా లేదుగా..!

Divya
సాధారణంగా చాలామంది బుల్లితెరపై నటిస్తూ వెండితెరపై అవకాశాల కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బుల్లితెరపై పలు షోలలో సీరియల్స్ లో నటించి.. చాలామంది సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీ దక్కించుకొని ఆ తర్వాత సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటున్నారు. అయితే మరికొంతమంది ముందుగా సినిమాలలో అవకాశాలు దక్కించుకొని అక్కడ స్టార్ పొజిషన్ కి చేరుకున్న తర్వాత అవకాశాలు తగ్గిన సమయంలో తిరిగి మళ్లీ బుల్లితెరకు వచ్చేస్తున్నారు. ఒకప్పుడు వెండితెరను ఏలిన ఎంతోమంది ఇప్పుడు బుల్లితెరపై కూడా రాణిస్తున్నారు ఇక వారెవరో ఇప్పుడు చూద్దాం.
ఇకపోతే ఒకప్పుడు టాలీవుడ్ వెండితెరపై హీరోయిన్లుగా మెరిసి తమ అందచందాలతో ప్రేక్షకులను అలరించిన హీరోయిన్లు ఇప్పుడు సీరియల్స్ లో కూడా బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. వారిలో ముందుగా రాశి.. జానకి కలగనలేదు అనే సీరియల్ లో అద్భుతమైన పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తన మాట తీరు, కట్టు బొట్టుతో యువతను సైతం ఆకట్టుకుంటున్న ఈమె అందానికి, నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.
కస్తూరి శంకర్ అన్నమయ్య తో సహా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న కస్తూరి శంకర్.. ఇప్పుడు ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ తో ప్రేక్షకులను మరింత అలరిస్తోంది. అంతేకాదు అప్పుడప్పుడు కొన్ని సీరియల్స్ లో స్పెషల్ గెస్ట్ గా పాత్రలు కూడా పోషిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఆమని.. తన అంద చందాలతో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఆమని ఇప్పుడు ముత్యమంత ముద్దు అనే సీరియల్ లో కూడా నటించి మెప్పించింది.. ప్రభ.. సినిమాలలో హీరోలకు తల్లి పాత్రలో నటించి మెప్పించిన ప్రభ కలసి ఉంటే కలదు సుఖం అని సీరియల్ లో కూడా నటించింది. ఇక వీరితోపాటు యమలీల సీరియల్ లో మంజు భార్గవి,  నాగభైరవి సీరియల్ లో రమ్యకృష్ణ,  దేవతా సీరియల్ లో సుహాసిని,  ఝాన్సీ, పిన్ని, చంద్రకుమారి వంటి సీరియల్స్ లో రాధిక , మై నేమ్ ఇస్ మంగతాయారు వంటి సీరియల్ లో మహేశ్వరి ఇలా చాలామంది బుల్లితెరపై కూడా అలరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: