టీవీ: హైపర్ ఆది జబర్దస్త్ కు పూర్తిగా గుడ్ బై చెప్పినటే..!!

Divya
జబర్దస్త్ నుంచి మళ్లీ హైపర్ ఆది తప్పుకున్నారని విషయం గత కొద్దిరోజులుగా వైరల్ గా మారుతోంది .కానీ ఈసారి ఆయన తిరిగి వచ్చే ప్రసక్తి లేదన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మల్లెమాల ఈటీవీ వారు ఈ విషయాన్ని గమనించి సరికొత్త కమెడియన్లను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి పలు ప్రయత్నాలు చేస్తోంది. ఇలా హైపర్ ఆది కూడా జబర్దస్త్ కు అందరూ గుడ్ బై చెప్పారని విషయాన్ని భావిస్తున్నారు. ఈ సమయంలోనే సద్దాం ఎంట్రీ ఇవ్వడంతో ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని నిజమే అని నమ్మేశారు.

అయితే ఇప్పటివరకు సద్దాం ఎంట్రీ ఇచ్చిన రెండు ఎపిసోడ్లు కూడా బాగానే సక్సెస్ అయినట్లుగా మల్లెమాల వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన టీం చేసిన క్రీస్తు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. అన్ని విధాలుగా జబర్దస్త్లు సద్దాం కామెడీ కి ప్రేక్షకుల తో పాటు టిఆర్పి రేటింగ్ కూడా కాస్త పెరగడంతో హైపర్ ఆది లేని లోటు కచ్చితంగా ఈ కమెడియన్ తీరుస్తున్నాడు అంటూ పలువురు బుల్లితెర ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో హైపర్ ఆది లేని సమయంలో ఆదరణ ఉండేది కాదని..

కానీ ఇప్పుడు ఈ షోని జనాలు తెగ చూసేస్తున్నారని అందుకు కారణం సద్దాం ఉండడమే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి పటాస్ షోలో కూడా సద్దాం బాగానే ఆకట్టుకున్నారు.ఆ తర్వాత కొన్ని కారణాల చేత జీతెలుగు మరియు స్టార్ మా కార్యక్రమాలకు వెళ్లారు అక్కడ కూడా బాగానే ఆకట్టుకున్నారు. దీంతో మళ్లీ ఎటు తిరిగి ఈటీవీ మల్లెమాల లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. హైపర్ ఆది లేకపోవడంతో ఈ షో చాలా దారుణంగా పడిపోతుందని అందరూ భావించారు. కానీ ఆతరణంలోనే సద్దాం ఎంట్రీ ఇవ్వడంతో అది జరగలేదు. దీంతో సద్దాం దెబ్బకు హైపర్ ఆది పూర్తిగా గుడ్ బై చెప్పాల్సింది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: