టీవీ: శ్రీముఖి రాత్రి వేళలో అలా చేయడం వల్లే ఇలా ఉన్నానంటున్న శ్రీముఖి..!!

Divya
బుల్లితెరపై ఎనర్జిటిక్ యాంకర్ ఎవరంటే టక్కున యాంకర్ శ్రీముఖి పేరు గుర్తుకువస్తుంది. శ్రీముఖి ఏ ఛానల్ లో చూసినా సరే ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తూ తన హవా కొనసాగిస్తోంది.. మొదట అదుర్స్ అనే షో ద్వారా మొదటిసారిగా బుల్లితెరపై అడుగుపెట్టిన శ్రీముఖి ఆ షో బాగానే కలిసి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఎన్నో షోలకు యాంకర్ తో పాటు, పలు సినిమా ఈవెంట్లకు కూడా యాంకర్ గా చేసింది శ్రీముఖి. పైగా ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించడంతో బుల్లితెరపై ఉండే క్రేజ్ తో ఇమే బిగ్ బాస్ సీజన్ 3 లో కూడా అడుగుపెట్టింది.

బిగ్ బాస్ లో అడుగుపెట్టిన తర్వాత మరింత పాపులర్ అయింది శ్రీముఖి. ఆ తర్వాత సినిమాలలో నటించే అవకాశాలు కూడా వెలుపడ్డాయి. అయితే హీరోయిన్ గా కొన్ని చిత్రాలలో నటించిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ పలు చిత్రాలలో సైడ్ క్యారెక్టర్లలో నటించి బాగానే ఆకట్టుకుంది శ్రీముఖి. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్గానే ఉంటూ తన అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది శ్రీముఖి. ప్రతిరోజు కూడా ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే వైరల్ గా మారుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా శ్రీముఖి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది.
వివాహం చేసుకోకుండా కేవలం ఒంటరిగా ఉంటూ వచ్చిన షోకి సైన్ చేసుకుంటూ తను బిజీ లైఫ్ని గడుపుతోంది.అయితే ఇప్పటివరకు వరుస  షోలతో యాంకర్ గా బిజీగా ఉన్న శ్రీముఖి తాజాగా ఈటీవీలో మరొక షోలో కూడా యాంకర్ గా చేస్తోంది. మిస్టర్ అండ్ మిసెస్ అనే షో కి సంబంధించి తాజా ప్రోమో వైరల్ గా మారుతోంది. ఇందులో బుల్లితెర సెలబ్రిటీలు పాల్గొని అందజేస్తున్నారు. ఇందులో ఒక సీరియల్ నటుడు నీకు ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చింది అని అడగగా.. అందుకు శ్రీముఖి నేను కూడా ఈ మధ్య నైట్ టైం లో వీడియో కాల్స్ బాగా మాట్లాడుతున్నానని సరదాగా చెప్పడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారు తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: