టీవీ: హైపర్ ఆది పరువుతీసిన కృష్ణ భగవాన్..!!

Divya
జబర్దస్త్ షో ప్రేక్షకులను ఎంతగా ఎంటర్టైన్మెంట్ చేస్తుందో చెప్పాల్సిన పని లేదు. ఈ కామెడీ షోలో జడ్జిలు, కంటిస్టెంట్లు మారుతున్నప్పటికీ రేటింగ్ మాత్రం బాగానే రాబడుతోందని చెప్పవచ్చు. ఎంతోమంది కమెడియన్లకు లైఫ్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఎంతోమంది కన్సిస్టెంట్లు వచ్చిపోతున్న జడ్జిలుగా రోజా, నాగబాబు ముందు నుండి నడిపించేవారు. అయితే కొన్ని కారణాల చేత నాగబాబు వెళ్లిపోగా.. రోజాకు మంత్రి పదవి రావడంతో ఈ షోను విడిచి వెళ్ళింది ఇక స్థానంలో ఇంద్రజ, ఖుష్బూ వంటి వారు వచ్చారు. వీరితో పాటుగా సింగర్ మనో కొద్దిరోజులు జడ్జిగా ఉన్నారు.

ఇక తరువాత కృష్ణ భగవాన్ జడ్జిగా రావడం జరిగింది. ఇక ఈయన రాకతో షో కి మరింత బూస్టింగ్ వచ్చినట్లుగా ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. తాజాగా జబర్దస్త్ కు సంబంధించి ఒక ప్రోమో విడుదల కాగ అందులో హైపర్ ఆది కృష్ణ భగవాన్ విల్ చైర్ లో రావడం జరుగుతుంది. ఆ సమయంలో కృష్ణ భగవాన్ వీల్ చైర్ తోయకుండా తనను తోస్తున్నావేంటి అని అడగగా అందుకు హైపర్ ఆది మిమ్మల్ని అయినా అది తోస్తోంది ఇది అయితే నా వెనుక ఏదేదో చేస్తుంది అని తెలియజేశారు.

ఇక తర్వాత ఇంద్రజ తో వర్క్ చేస్తున్నారుగా అది ఎలా ఉంది అని  ఆది అడగగా.. ఆవిడకేంటి ఎప్పుడూ ఎవరీ గ్రీన్ గా.. గ్రీన్ సారీలో.. గ్రీన్ బ్యాంగిల్స్ వేసుకొని రావడం చాలా బాగుంటుందని కృష్ణ భగవాన్ పంచులు వేయడం జరిగింది. ఇది విన్న హైపర్ ఆది ఇది నిజంగానే ఎవ్రీ గ్రీన్ అని తెలియజేస్తారు. అటు తరువాత మన ముందర పూజా హెగ్డే , తమన్నా వెళితే మీరు ఎవరిని చూస్తారు అని హైపర్ ఆది అడగగా.. కృష్ణ భగవాన్ తమన్నాను చూస్తానని అనగా.. హైపర్ ఆది మాత్రం నేను ఇద్దరిని చూస్తానని తెలియజేశారు. అందుకే మనం ఈ పొజిషన్లో ఉన్నాము మన బాడీలో అన్ని పడిపోయిన నోరు ఒకటే ఎందుకు ఉంచావు ఆది అని అడగగా దానికి కృష్ణభగవా నోటి దూల ఉంది కాబట్టి అని పరువు తీసేసారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: