'కార్తీక దీపం' లో డాక్టర్ బాబు ఎంట్రీ పై క్లారిటీ?

VAMSI
కార్తీక దీపం సీరియల్  తో బాగా పాపులర్  అయిన హీరో నిరుపమ్. అంతకు  ముందు చంద్రముఖి సీరియల్ తో కూడా బాగా ఫేమస్ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన నటన మాత్రం నిరుపమ్ కి కార్తీక దీపం సీరియల్ లోనే పడిందని చెప్పాలి. అయితే ఈ హీరో తన సతీమణి మంజులతో కలిసి చేసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అందులో ప్రేక్షకుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు ఈ జంట.
చంద్రముఖి సీరియల్ లో వీరిద్దరూ హీరో, హీరోయిన్లుగా నటించారు. అప్పుడే వీరి మద్య ప్రేమ చిగురించింది, తమ ప్రేమను పెళ్లి పీటలు ఎక్కించి ఒకటయ్యారు ఈ కపుల్.
అయితే పెళ్లి కార్డ్ ఇచ్చే వరకు కూడా వీరి ప్రేమ విషయం సెట్ లో ఎవరికీ తెలియదు అంటే వీరు ఎంతలా మ్యానేజ్ చేశారో చెప్పాలా. కళ్ళతోనే ప్రేమను తెలుపుకుని లేట్ కాకుండా పెళ్లితో ఒక్కటయ్యారు. అలా సైలెంట్ గా ప్రేమించుకున్న వీరు తమ పెళ్లి కార్డ్ ఇవ్వడంతో అసలు ఇదంతా ఎపుడు జరిగింది అని అంతా షాక్ అయ్యారట.
ఇక ఈ జంట కి అభిమానులు కూడా చాలా ఎక్కువే. ఈ మధ్య సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ బాగా ఆక్టివ్ గా ఉంటున్న వీరికి తరచూ చాలా ప్రశ్నలు ఎదురవుతుంటాయి. కాగ్ వాటిలో ఎక్కువుగా అభిమానులు అడుగుతున్న ప్రశ్నలకు కలిసి సమాధానాలు చెప్పారు నిరుపమ్, మంజులలు.
ఇందులో ప్రేక్షకులు మీరు ఎందుకు కలిసి నటించడం లేదు..?? ఎపుడు కలిసి నటిస్తారు అని అడుగగా..!! అందుకు మంజుల ప్రాక్టికల్ గా చెప్పాలంటే.. నా వయసు 36 ఈ ఏజ్ లో నాకు హీరోయిన్ పాత్రలు దొరకవు. అలాగని నిరుపమ్ నాకోసం వేరే పాత్రలు చేయడు, హీరోగానే చేస్తాడు. కాబట్టి మేమిద్దరం కలిసి నటించలేం. ఒకవేళ తన సీరియల్ లో ఏదైనా చిన్న పాత్ర దొరికినా చేస్తాను అని అన్నారు. అలాగే కార్తీక దీపం సీరియల్ లో ఇకపై మళ్ళీ మేము కనిపించబోయేదీ లేదని క్లారిటీ ఇచ్చేశారు నిరుపమ్. కార్తీక దీపాలు మళ్లీ రీ ఎంట్రీ ఇస్తారని అందరు ఎక్స్పెక్ట్ చేయగా,, ఈ సమాధానం తో వారి ఆశలు నీరుగారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: