టీవీ: భర్త కాళ్లు మొక్కిన అనసూయ.. కారణం ఏమిటంటే..!!

Divya
బుల్లితెరపై ప్రతి ఒక్కరు మెచ్చుకునే అందాల యాంకర్ అనసూయ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. బుల్లితెరపై గ్లామర్ ఒలకబోస్తూ వెండితెరపై కూడా వైవిధ్యమైన పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను బాగా అలరించింది. రీసెంట్ గా అనసూయ పుష్ప చిత్రంలో దాక్షాయని పాత్రలో నటించింది.. ఇందులో సునీల్ భార్య పాత్రలో అనసూయ చాలా ర్యాష్ గా నటించిందని చెప్పవచ్చు. పుష్ప పార్ట్-2 లో కూడా ఈమె పాత్ర చాలా హైలెట్గా ఉండబోతుందట. ఇక అనసూయ అందం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
గ్లామర్ పరంగా అనసూయను ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక సినిమాల ఎంపిక విషయంలో కూడా చాలా తొందర పడదు అనసూయ. కథను బట్టి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది అనసూయ. వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఓకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె ఎన్నో చిత్రాలలో నటించి ఉండేది. పాత్ర నచ్చితేనే ఆ చిత్రాల్లో నటిస్తూ ఉంటుంది అనసూయ. రంగస్థలం, పుష్ప వంటి చిత్రాలలో అనసూయ నటనకు ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. ఇక రంగస్థలం సినిమాలో ఒక గృహిణిగా అనసూయ నటన ప్రేక్షకులను మైమరిపించేలా నటించింది.
సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటుంది అనసూయ. తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలు తన లేటెస్ట్ ఫోటోలను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది. వివాహమైన మహిళలు చేసే పూజ కావడంతో అనసూయ కూడా తన ఇంట్లో సావిత్రి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించింది.. పూజ పూర్తయిన వెంటనే తన భర్త భరద్వాజ కాళ్లకు మొక్కుతూ ఆశీర్వదించమని కోరినట్లుగా తెలుస్తోంది. ఈ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. మన సాంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించే అవకాశం వచ్చినప్పుడు తనలో చాలా పాజిటివ్ ఎనర్జీ మొదలవుతుందని మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని తెలియజేసింది అనసూయ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: