టీవీ: స్టేజ్ పైనే ఇమాన్యుల్ పరువు తీసేసిన పోసాని..?
అయితే తాజాగా పోసాని కృష్ణమురళి ఈ జంట పైన సెటైర్లు వేయడం జరిగింది.. శ్రీముఖి హోస్టు గా వ్యవహరిస్తున్న జాతి రత్నాలు షో కి ఈమె యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఇక ఇందులో కామెడీ లతో ఈ షో ఏప్రిల్ 4వ తేదీ నుంచి ప్రారంభించబడుతుంది. చూస్తుంటే ఈ షో ఈటీవీ ప్లస్ లో గతంలో సాగిన పటాస్ షో కి కొనసాగింపు అన్నట్లుగా కనిపిస్తోంది. అయితే మొత్తానికి ఈ షోలో యాక్టర్ పోసాని సందడి చేయడం జరిగింది.
ఇక భార్య భర్తలు ఇంట్లో వర్ష - ఇమ్మాన్యుయేల్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ఉందా..? లేదా.. ? వుండి లేనట్లే ఉన్నారా.. అని అనుకుంటూ వాళ్లిద్దరి మధ్యలో ఏం లేకుండా పోతోంది అని స్టాండప్ కమెడియన్ గా మారడం అందరికీ ఆసక్తికరంగా మారింది. అంతే కాదు అసలు నీకు ఉందా..? లేదా..? అనే డబుల్ మీనింగ్ తో అందరి ముందే ఇమ్మాన్యుయేల్ పరువు తీసేసాడు పోసాని. జనవరి 4వ తేదీ నుంచి అలరించనున్న ఈ షో ను ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో చూడాలి మరి.. కమెడియన్లు మాత్రం తమకు శాయశక్తులా కృషి చేస్తూనే వున్నారు. ఏది ఏమైనా ఈ షో మరింత పాపులర్ అయ్యేలా తెలుస్తోంది..