టీవీ: స్టేజ్ పైనే ఇమాన్యుల్ పరువు తీసేసిన పోసాని..?

Divya
బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలలో ఎంతో మంది కమెడియన్ లు నటిస్తూ అలా ఇప్పుడు బుల్లితెరపై వర్ష - ఇమ్మాన్యుయేల్ ట్రాక్ ఎంత పాపులారిటీ అయ్యిందో మనం చెప్పనవసరం లేదు. ఇక బుల్లితెరపై సుధీర్ - రష్మీ డీ జోడి తో పోటీగా హీరో పాపులారిటీ అయ్యాడని చెప్పవచ్చు. ఇక ఈ జంట కూడా ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అయిపోయారు. ఒక్కొక్కసారి వీరిద్దరూ నిజమైన ప్రేమికులు అన్నట్లుగా ప్రేక్షకులను మైమరిపించారు నటిస్తూ ఉంటారు. కానీ వీరిద్దరి మధ్యలో చేసే అతి వల్ల అందరికీ అర్థమైపోతూ ఉంటుంది. అయితే తాజాగా పోసాని ఈ జంటపై కామెంట్లు చేసినట్లుగా తెలుస్తోంది వాటి గురించి చూద్దాం.
అయితే తాజాగా పోసాని కృష్ణమురళి ఈ జంట పైన సెటైర్లు వేయడం జరిగింది.. శ్రీముఖి హోస్టు గా వ్యవహరిస్తున్న జాతి రత్నాలు షో కి ఈమె యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఇక ఇందులో కామెడీ లతో ఈ షో ఏప్రిల్ 4వ తేదీ నుంచి ప్రారంభించబడుతుంది. చూస్తుంటే ఈ షో ఈటీవీ ప్లస్ లో గతంలో సాగిన పటాస్ షో కి కొనసాగింపు అన్నట్లుగా కనిపిస్తోంది. అయితే మొత్తానికి ఈ షోలో యాక్టర్ పోసాని సందడి చేయడం జరిగింది.
ఇక భార్య భర్తలు ఇంట్లో వర్ష - ఇమ్మాన్యుయేల్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ఉందా..? లేదా.. ? వుండి లేనట్లే ఉన్నారా.. అని అనుకుంటూ వాళ్లిద్దరి మధ్యలో ఏం లేకుండా పోతోంది అని స్టాండప్ కమెడియన్ గా మారడం అందరికీ ఆసక్తికరంగా మారింది. అంతే కాదు అసలు నీకు ఉందా..? లేదా..? అనే డబుల్ మీనింగ్ తో అందరి ముందే ఇమ్మాన్యుయేల్ పరువు తీసేసాడు పోసాని. జనవరి 4వ తేదీ నుంచి అలరించనున్న ఈ షో ను  ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో చూడాలి మరి.. కమెడియన్లు మాత్రం తమకు శాయశక్తులా కృషి చేస్తూనే వున్నారు. ఏది ఏమైనా ఈ షో మరింత పాపులర్ అయ్యేలా  తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: