"దేవత" సీరియల్ లో మరో ట్విస్ట్... అసలు నిజం చెప్పేసిన ఆదిత్య ?

VAMSI
స్టార్ మా ఛానల్ లో సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతి రోజూ రాత్రి 8.30 కు ప్రసారమౌతున్న దేవత సీరియల్ బాగా ఫేమస్ అన్న విషయం విదితమే. బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ సీరియల్400 ఎపిసోడ్ లను క్రాస్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. అయితే ఈ మధ్య ఈ సీరియల్ పై ప్రేక్షక అభిమానులు కాస్త అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా ఈ సీరియల్ ప్రేక్షకులు ఆదిత్య , రుక్మిణీ లకు పెద్ద ఫ్యాన్స్. వారిద్దరు కలిస్తే చూడలని కోరుకుంటున్న వారే. కథలో ట్విస్ట్ లు కావాలంటే తీసుకురండి, కానీ వీరిని దూరం చేయకండి అని అంటున్న వారే. అయితే నిన్న మొన్నటి వరకు సత్యకు చాలా దూరంగా ఉన్న ఆదిత్య ఇపుడు చాలా క్లోజ్ గా ఉంటుడడం, వీరి మధ్య కెమిస్ట్రీ ఎక్కువగా చూపిస్తుండడంతో ప్రేక్షకులు అయిష్టతను కనబరుస్తున్నారు.
మరో వైపు ఆ మాధవ్ క్యారెక్టర్ ని రోజు రోజుకు బలంగా మారుస్తూ  ఆ ఇంటి పరువు కోసం, ఆ ఇంటి మనుషులను బాధించకుండా ఉండటం కోసమైనా రుక్మిణీ ఆ ఇంటిని వదిలి పెట్టకుండా చేసేలా ఉన్నారు డైరెక్టర్ సారు. అలా మాత్రం ససేమిరా చేయకండి డైరెక్టర్ అంటూ తమ బాధను సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు పలువురు అభిమానులు. అందులోనూ ఈ మధ్య ఆదిత్య కంటే మాధవ్ కి ఆ ఇంట్లో వారికే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు క్యారెక్టరైజేషన్ ఉండడంతో దాన్ని అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. దాంతో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
కాగా ప్రేక్షకుల కోరిక మేరకు రుక్మిణీ మరియు ఆదిత్యలను దగ్గర చేసేలా డైరెక్టర్ ఓ ట్విస్ట్ ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఆదిత్య , మాధవ్ ల మధ్య దేవి కోసం గొడవ జరుగుతున్న సమయంలో కోపంలో ఆదిత్య దేవి తన కన్న కూతురు అన్న విషయాన్ని చెప్పేలా సీరియల్ ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అక్కడి నుండి మరో ట్విస్ట్ మొదలుపెట్టాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఏదైతేనేం ఆదిత్య, రుక్కు లని కలపండి డైరెక్టర్ సార్ అంటున్న అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే. మరి ముందు ముందు జరగబోయే ఎపిసోడ్ లు ఏ విధంగా ఉండనున్నాయి అన్నది తెలియాల్సి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: