టీవీ: నెటిజన్ అడిగిన ప్రశ్నకు.. యాంకర్ శ్యామల పోస్ట్ వైరల్..!!

Divya
అందాల రాశి.. చూసిన వారిని ఆకట్టుకునే అందం.. తెలుగు యాంకర్ శ్యామల కు మాత్రమే సొంతం అని చెప్పవచ్చు. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇక వెండితెరపై బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న యాంకర్ శ్యామల సోషల్ మీడియాలో అయితే ప్రత్యేకంగా ఒక ఫ్యాన్ బేస్ ని కూడా ఈమె మెయింటైన్ చేస్తోంది. శ్యామల ఒకప్పుడు సీరియల్స్ తో మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. తర్వాత సినిమాలలో కూడా తనకంటూ మంచి మంచి పాత్రలను సంపాదించుకొని.. వెండితెర ప్రేక్షకుల మదిలో కూడా చెరగని ముద్ర వేసుకుంది..

ఇక ఈమె ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ షో లు.. ఇతర షోలు మరికొన్ని సినిమా ఈవెంట్ ల వైపు వెళ్లడం జరిగింది. తన కెరీర్ ని మొదలు పెట్టినా  యాంకర్ గానే బాగా ఫేమస్ అయింది. ఈ మధ్య కాలంలో శ్యామల మరీ ఎక్కువగా వైరల్ అవుతోంది అని చెప్పవచ్చు. రాంగోపాల్ వర్మ ఈమె పై చేసిన హాట్ కామెంట్లతో శ్యామల మళ్లీ వెలుగులోకి వచ్చింది.. ఇకపోతే శ్యామల షూటింగ్ నిమిత్తం ముంబై కి వెళ్ళింది. అక్కడ భీమ్లా నాయక్ సినిమా చూడాలా వద్దా అనే డైలమాలో పడిపోయింది ఈ ముద్దుగుమ్మ. హెయిర్ స్టైలిస్ట్ గురించి చెబుతూ ఆయన పరువు కూడా తీసేసింది.. కేశాలు.. కేశాలంకరణ అంటే ఏంటో కూడా నీకు తెలియదు అంటూ తన హెయిర్ స్టైలిస్ట్ గురించి శ్యామల చెబుతూ నవ్వడం జరిగింది.
ఇక తాజాగా తన అభిమానులతో ముచ్చటించిన ఈమె ఒక్కొక్కరు ఒక్కో రకమైన ప్రశ్నలు ఈమెను అడగడం జరిగింది. అంతే కాదు కొంత మంది పర్సనల్ విషయాలను కూడా టచ్ చేసి తన కొడుకు గురించి కూడా కొన్ని ప్రశ్నలు అడిగారు. ఒక నెటిజన్ ప్రశ్న అడుగుతూ..ఇషాన్ ఆడుకోవడానికి ఒక చెల్లిని ఇవ్వచ్చు కదా అని అడిగాడు.. అందుకు శ్యామల ఓరి దేవుడా అంటూ నవ్వుతున్న ఈమోజీ లను కూడా షేర్ చేసింది.. ప్రస్తుతం ఈ కామెంట్ కాస్త నెట్టింట బాగా వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: