టీవీ: కస్తూరి సీరియల్ పరంధామయ్య.. ముందు ఎక్కడ పని చేశారో తెలుసా..?
పరంధామయ్య అలియాస్ పరం అని ముద్దుగా పిలుచుకునే ఇతని పేరు నాగార్జున్.. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో జూలై 27న జన్మించారు.. ఇతడు ప్రస్తుతం కస్తూరి సీరియల్ లో బెంగుళూరులో ఉంటున్నారు. చిన్నప్పటి నుంచి నాగార్జున్ కి నటన అంటే ఇష్టం ఎక్కువ..ఇక ఆ ఇష్టం తోనే స్కూల్, కాలేజ్ డేస్ లో నాగార్జున్ కల్చరల్ ప్రోగ్రామ్స్ జరిగితే ఎంతో యాక్టివ్ గా పాల్గొనేవాడు. ప్రస్తుతం యాక్టర్ గానే కాకుండా మోడల్ గా కూడా ఒక మంచి పేరు తెచ్చుకుంటున్నాడు నాగార్జున్..
నటన మీద వున్న మక్కువ ఇండస్ట్రీ వైపు నడిపించింది.. చదువు పూర్తయ్యాక కన్నడ టీవీ సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు..అలా మొదటిసారి నాగార్జున్ గిరిజా కళ్యాణం సీరియల్ లో నటించి అక్కడ కన్నడ ఆడియన్స్ మదిని దోచుకున్నారు. దాంతో శాంతం, మారాలి బంధాలు పాపం, అగ్నిసాక్షి వంటి పలు సీరియల్స్ లో ఛాన్స్ దక్కించుకున్నాడు.అంతేకాదు కన్నడ షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించి, తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు. కన్నడలో నాగిని 2 చేస్తూ..మరో వైపు తెలుగులో కస్తూరి సీరియల్స్ చేస్తూ దూసుకెళ్తున్నారు.. ఏది ఏమైనా నాగార్జున్ సినీ ఇండస్ట్రీ లోకి కూడా అడుగు పెట్టాలి అని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.