టీవీ: ఆర్.జే. కాజల్ కు గడ్డుకాలం మొదలైందిగా..!

Divya
ఆర్.జే.కాజల్.. ఈమె బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో కంటెస్టెంట్ గా పాటిస్పేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల శనివారం రోజు జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున ఆడించిన ఆటలో ఆర్. జే. కాజల్ కు వ్యతిరేకత ఎదురైంది.. అయితే ఈ ఆట ఏమిటంటే.. ఎవరితో సెట్, ఎవరితో కట్ అనే ఆటలో కాజల్ కు ఎదురు దెబ్బ తగిలింది అని చెప్పవచ్చు.. ముఖ్యంగా ఏ ఒక్కరూ కూడా కాజల్ తో సెట్ అని, ఒక ఫ్రెండ్షిప్ బ్యాండ్ కూడా కట్టలేదు. ఇది చూసిన వెంటనే ఇంట్లో దాదాపుగా సగానికి పైగా హౌస్ మేట్లు కాజల్ తో కట్ అంటూ మొహం మీద చెప్పేశారు..

ఒక్కొక్కరు కాజల్ ఫోటోలు చాలా కసికసిగా ముక్కలు ముక్కలుగా చేసి పెట్టడం గమనార్హం.. వీరు ఈమెతో కలవలేక పోవడానికి గల కారణాలు కూడా చెప్పారు. ఈమె గురించి బయట ప్రజలు ఏమనుకుంటున్నారో..? ఇక హౌస్ మేట్స్  కూడా అదే అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక నాగార్జున కూడా కాజల్ గురించి దొంగ దొరికేసింది.. మ్యారేజ్ బ్యూరో పెట్టావా ఏంటి అంటూ సోషల్ మీడియా ట్రోల్స్ ను కూడా గుర్తుచేశారు నాగార్జున. దీంతో ఈమెకు బిగ్ బాస్ ఇంటా బయట కూడా వ్యతిరేకత నెలకొందని అర్థమవుతోంది. ఇక వచ్చే వారంలో కూడా ఈమె ఎలిమినేషన్ రౌండ్ కు నామినేట్ అయ్యే అవకాశం ఉంటుందని తెలుస్తోంది..
ఇకపోతే ఈమె గురించి లోబో, ఉమాదేవి, శ్రీరామచంద్ర చెప్పిన కారణాలు మాత్రం అదిరిపోయేలా ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే ప్రతి దాంట్లో దూరడం, ఏ ఇద్దరు మాట్లాడుతున్న వారి మధ్యలో దూరడం,  ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు.. అంటూ కాజల్ గురించి లోబో చెప్పిన మాటలు చాలా వైరల్ గా మారాయి. శ్రీ రామచంద్ర కూడా ఇలా అనడంతో కాజల్ గురించి వీరు చెప్పేది నిజమే అని అనిపిస్తోంది. ఇక ఉమాదేవి కూడా కాజల్ ఫోటోలు ముక్కలుముక్కలుగా చింపడం ప్రస్తుతం ఆమె వ్యతిరేకతకు నిదర్శనంగా నిలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: