టీవీ : రష్మీ తండ్రి వాళ్లను వదిలి వెళ్ళడానికి కారణం..

Divya

ప్రస్తుతం వెండితెర మీద అటు బుల్లితెర మీద రెండు వైపులా తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న నటులలో రష్మీ కూడా ఒకరు. ఈమె వెండితెరపై ఎన్నో సినిమాల్లో నటించినా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక సినిమాలకు గుడ్ బై చెప్పి , మళ్ళీ జబర్దస్త్ లో యాంకర్ గానే  చేస్తున్నది. ఇకపోతే ఇటీవల ఈమెకు సినిమా ఆఫర్స్ వచ్చినా అవి కూడా రిజెక్ట్ చేసిందట.ఇదిలా వుండగా ఈమె తండ్రి తన దగ్గర నుంచి వెళ్ళిపోయాడట.. అది ఎందుకో ఒకసారి తెలుసుకుందాం.

రష్మీ చాలా సున్నితమైనమనస్తత్వం కలిగినది, ఎంతలా అంటే ఏదైనా జంతువులకు గాయం తగిలితే చలించి పోయే అంతలా, సున్నితమైన మనసు కలిగినది రష్మీ ఇక రష్మీ ఫ్యామిలీ విషయానికి వస్తే, తన జీవితంలో ఎన్నో కష్టాలని ఎదుర్కొని, తమ ఫ్యామిలీ కోసం ఎంతో కష్టపడి శ్రమించి సంపాదిస్తున్నాను అని  చెప్పుకొచ్చింది రష్మి.
ఇక రీసెంట్ గా సిక్స్త్ సెన్స్ అనే ప్రోగ్రాం లో కి రష్మీ గెస్ట్ గా వచ్చింది. ఈ ప్రోగ్రాం లో రష్మీ తన ఫ్యామిలీ గురించి తెలియజేయడం జరిగింది. తన తల్లి తనను పెంచడానికి పడిన కష్టాలను తెలియజేస్తూ ఏడ్చేసింది. ఇక తనని తన అమ్మను తన తండ్రి వదిలేసి వెళ్ళిపోయారట. పిల్లలకి చిన్న వయసులో ఇలాంటి బంధాలు ఉంటాయనే విషయం కూడా తెలియదు. అదంతా కేవలం తల్లిదండ్రుల వల్ల అని తెలుస్తుంది అని రష్మీ తెలిపింది.
ఒకవేళ అలా తెలియజేయ లేకపోతే  పిల్లల్ని కనకండి.. అంటూ బోరున ఏడ్చిన రష్మీ. ఒకవేళ మీరు పిల్లల్ని కనేసి వదిలి వెళ్ళిపోతే ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు పడతారో తెలుసా? అని ఎమోషనల్ అయ్యింది రష్మీ. కానీ తన తండ్రి ఎందుకు వదిలి వెళ్ళాడు అనే విషయం చెప్పలేదు. ఇక ఈ విషయం పూర్తిగా తెలుసుకోవాలంటే త్వరలో ప్రసారమయ్యే సిక్స్త్ సెన్స్ ప్రోగ్రాం చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: