టీవీ : వంటలక్క.. కార్తీకదీపం సీరియల్ ను ఎందుకు వద్దనుకుందో తెలుసా..?

Divya

బుల్లితెరపై నడిచే నాటికలలో టీ ఆర్ పీ లో  మొదటి స్థానం లో ఏదైనా నాటిక ఉంది అంటే అది కేవలం కార్తీకదీపం సీరియల్ అనే చెప్పవచ్చు. అంతలా ఆ నాటికలో ఉండే పాత్రలు ప్రేక్షకులను అలరించాయి. అయితే ఇందులో ముఖ్యంగా  వంటలక్క, డాక్టర్ బాబు అనే పేర్లు.. ఏకంగా టిక్ టాక్ లో వీడియోస్ చేసే విధంగా పాపులర్ అయ్యాయి. అయితే  కార్తీకదీపం నాటికలో వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్ నటించనని చెప్పిందట. అలా ఎందుకు చెప్పిందో తెలుసుకుందాం.

బుల్లితెర నుంచి వెండితెర వైపు అడుగులు వేయబోతున్న నటి ప్రేమి విశ్వనాథ్. ఈమెకి అంతలా పేరు రావడానికి గల కారణం కార్తీకదీపం సీరియల్  అని ఈమె ఎన్నోసార్లు తెలిపింది. అయితే మలయాళంలో నటించగా అక్కడితో పోలిస్తే, వంటలక్కకి తెలుగులోనే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు. దీంతో ఆమె ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళిపోయింది.

ఈ నాటిక  ను కాపుగంటి రాజేంద్ర ప్రసాద్  డైరెక్షన్ చేస్తున్నారు. మొదట మలయాళం నుంచి ఈ నాటికను తెలుగులో రీమేక్ చేశారు. అయితే మొదట ఈమె మలయాళం నుంచి రీమేక్ లో తెలుగులోకి అనువదిస్తున్నప్పుడు..ఇందులో  నటించనని తెలియజేసిందట ప్రేమి విశ్వనాధ్. దానికి గల కారణం ఏమిటంటే.. ఈమెకు తెలుగు భాష సరిగ్గా రాకపోవడంతో ఈమె ఈ నాటిక  పై ఎక్కువ ఆసక్తి చూపలేదట. కానీ డైరెక్టర్ మాత్రం వంటలక్క పాత్రకు తాను అయితేనే సరిపోతుందని, డైరెక్టర్ బతిమిలాడితే ఆమె ఈ నాటికల్లో నటించడానికి ఒప్పుకుందట.
ప్రస్తుతం ఈమె ఈ నాటికలో  నటించడం నాకు చాలా చాలా ఆనందంగా ఉందని , పలు సందర్భాలలో తెలిపింది ప్రేమి విశ్వనాథ్. ఒకవేళ ఈమె ఈ నాటికలో నటించలేకపోయి ఉంటే, ఇంత మంది అభిమానులను సంపాదించు కోలేకపోవచ్చు. ప్రస్తుతం ఈ నాటికతో  పలువురు  స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశం వచ్చిందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: