టిక్ టాక్ స్టార్ దుర్గా రావు...బిగ్ బాస్ ఎంట్రీ...?

VAMSI
టిక్ టాక్ ఎంతో మంది వ్యక్తులను సెలబ్రిటీలు గా మార్చింది. టిక్ టాక్ వేదికను ఉపయోగించుకొని పలువురు తమ  ప్రతిభను బయట పెట్టే ప్రయత్నం చేశారు... తద్వారా ఫుల్ ఫేమస్ అయ్యారు. అలాంటి వారిలో దుర్గారావు కూడా ఒకరు. చెప్పాలంటే టిక్ టాక్ ద్వారా ఇతను ఆయన భార్య ఎంత ఫేమస్ అయ్యారు అంటే... వీరు తెలియని తెలుగు  ప్రేక్షకుడు లేరు అన్నంత పాపులారిటీ తెచ్చుకున్నారు ఈ డిఫరెంట్ కపుల్ . టిక్ టాక్ వేదికపై దుర్గా రావు  దంపతులు బిగ్ సెలబ్రిటీ లు. ఎన్నో పాటలకు స్టెప్పులు ఇరగదీసిన వీరు "నాది నక్కిలీసు గొలుసు..." పాట ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు.
సోషల్ మీడియాలో  వీళ్ళకి కొన్ని మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఈయన గురించిన ఓ తాజా వార్త అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 4 కంప్లీట్ కాగా... త్వరలో బి బి ఫైవ్ కోసం కంటెస్టెంట్ లను ఎంపిక చేసే పనిలో కార్యక్రమ నిర్వాహకులు ఉన్నట్లు తెలిసింది. ఇంటి సభ్యులుగా పలువురు సినీ ప్రముఖుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే బిగ్ బాస్ 5 తెలుగులో... టిక్ టాక్ దుర్గారావు ను కంటెస్టెంట్‌గా సెలెక్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు...దుర్గ రావు ఎప్పుడూ ఉత్సాహంగా ఉండడంతో పాటు, తన పక్క వారందరినీ ఎంటర్టైన్ చేస్తాడు...ఈ కారణం చేతనే దుర్గా రావు ను బిగ్ బాస్ యూ తీసుకోబోతున్నట్లు లీకులు వస్తున్నాయి.
ఈ వార్త విన్న కొందరు నెటిజన్లు దుర్గా రావు క్రేజ్ అలాంటిది... సినిమా హీరోలు సైతం దుర్గారావు స్టెప్పులు వేస్తూ సందడి చేస్తున్నారు. ఆయనకున్న క్రేజ్ అలాంటిది అంటున్నారు. మరికొందరు ఈయన నక్క తోక తొక్కినట్లు ఉన్నాడంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇటు జబర్దస్త్ వంటి పెద్ద ప్రోగ్రామ్స్ లో కూడా దుర్గా రావు దంపతులు ఛాన్స్ లు దక్కించుకొని సందడి చేస్తున్న విషయం తెలిసిందే. టిక్ టాక్ బ్యాండ్ అయినప్పటికీ వీరి క్రేజ్ మాత్రం పెరుగుతూనే ఉంది. ఇంతకీ దుర్గారావు బి బి 5 కి సెలెక్ట్ అయ్యారా లేదా అన్నది అధికారకంగా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: