ఫేమస్ షేర్డ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ యులు ఇంకా ఇండియన్ ఫేమస్ టూ వీలర్ కంపెనీ బజాజ్ ఆటో రెండు ఈవీ స్కూటర్లను సోమవారం నాడు మార్కెట్లో లాంచ్ చేయడం జరిగింది.కస్టమర్ ల వినియోగానికి అనుగుణంగా ఈ స్కూటర్లను డిజైన్ చేశారు. కస్టమర్ రోజువారీ వినియోగంతో పాటు డెలివరీ సేవల కోసం కూడా బాగా ఉపయోగపడేలా ఈ స్కూటర్లను రూపొందించామని ఆ కంపెనీలు వెల్లడించాయి.యులు,బజాజ్ ఆటో సంయుక్తంగా మిరాకిల్ జీఆర్ ఇంకా అలాగే డీఎక్స్ జీఆర్ పేరుతో లాంచ్ చేయడం జరిగింది.దేశీయ అవసరాలు, రోడ్లు ఇంకా అలాగే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వీటిని లాంచ్ చేస్తున్నట్టు యూలు ఇంకా బజాజ్ ఆటో ఒక ప్రకటనలో తెలిపాయి.ఇక మిరాకిల్ జీఆర్, డీఈఎక్స్ జీఆర్ ఈ-స్కూటర్లు స్వాపింగ్ బ్యాటరీలతో వర్క్ చేస్తాయి. ఇవి మాక్సిమం గంటకు 25 కి.మీ. అందిస్తాయి.
వీటికోసం ప్రత్యేకంగా ఎనర్జీ స్టేషన్లను నెలకొల్పామని, ప్రస్తుతం న్యూఢిల్లీ, ముంబై ఇంకా బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో 100 దాకా స్టేషన్లను ఏర్పాటు చేశామని యులు తెలిపింది. 2024 వ సంవత్సరం నాటికి ఈ సంఖ్యను 500కి పెంచాలని కంపెనీ యోచిస్తోంది. వాహన అవసరాలు ఇంకా అలాగే ప్రజల అంచనాలను దృష్టిలో ఉంచుకుని బాజజ్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు యులు సీఈవో అయిన అమిత్ గుప్తా చెప్పారు.గత మూడు నెలల్లో తమ వాహనాల సంఖ్యను బాగా రెట్టింపు చేశామనీ, దేశంలోని ప్రధాన నగరాల్లో ఏకంగా లక్ష వాహనాలను మోహరించేందుకు రెడీగా ఉన్నామని తెలిపారు. ఈ సంవత్సరం చివరి నాటికి పదిరెట్ల కంటే ఎక్కువ ఆదాయ వృద్ధిని సాధించాలని యూలు కంపెనీ లక్క్ష్యంగా పెట్టుకుంది.ఇక నెక్ట్స్జెన్ మేడ్-ఫర్ ఇండియా వాహనాలు అప్డేటెడ్ డిజైన్లతో మొత్తం ఎలక్ట్రిక్ మొబిలిటీ కేటగిరీకి మైలురాయిగా నిలుస్తాయని బజాజ్ ఆటో లిమిటెడ్ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎస్ రవికుమార్ పేర్కొనడం జరిగింది.