వామ్మో.. గేమ్ ఆడుతుండగా పేలిన మొబైల్?

ఈ టెక్నాలజీ యుగంలో ప్రస్తుతం మొబైల్  ఫోన్ వినియోగం బాగా పెరిగిపోయింది..అయితే ఇది ఎంత ప్రయోజనమో అంతే ప్రమాదం కూడా. కరోనా వైరస్ పుణ్యమా అని ఫోన్ల వినియోగం చాలా విపరీతంగా పెరిగింది.అసలు చిన్నా పెద్దా ఆడా మగా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజుల్లో వాడేస్తున్నారు. ఇక చిన్నారుల పరిస్థితి మాత్రం చాలా తీవ్రంగా ఉంది. చిన్నప్పటి నుంచి వారికి సెల్ ఫోన్లు చాలా ఎక్కువగా అలవాటు అయిపోతున్నాయి. అవి లేకుంటే అన్నం కూడా తినలేని పరిస్థితి ఈరోజుల్లో వస్తోంది. ఇక ఆన్ లైన్ క్లాసుల పుణ్యమా అని.. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఫోన్లను చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. క్లాసెస్ అయిపోయినప్పుడు చాలా ఎక్కువగా గేమ్స్ ఆడుకుంటున్నారు. గతంలో ఔట్ డోర్ గేమ్స్ ఆడిన పిల్లలు.. ఇప్పుడు స్క్రీన్ గేమ్స్ కు మాత్రమే అడిక్ట్ అవుతున్నారు. ఈ అలవాటును మాన్పించేందుకు తల్లిదండ్రులు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా కానీ కనీస మార్పు కూడా రావడం లేదు. అతిగా ఫోన్ లను వినియోగించి ప్రమాదాల బారిన పడుతున్నారు.


ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా పేలిపోవడం జరిగింది. దీంతో ఆ బాలుడికి చాలా తీవ్ర గాయాలయ్యాయి.ఇక ఉత్తర ప్రదేశ్ లోని మేవతి మొహల్లా ప్రాంతానికి చెందిన  జునైద్‌ అనే 13 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. జునైద్ తన గదిలో ఫోన్లో గేమ్‌ అడుకుంటున్నాడు. ఈ క్రమంలో మొబైల్‌ ఫోన్‌ ఒక్కసారిగా పేలిపోవడం జరిగింది. ఒక్కసారిగా గదిలో నుంచి భారీ శబ్దం రావడంతో కుటుంబ సభ్యులు దెబ్బకు భయంతో పరుగులు తీశారు.వారు పరుగు పరుగున అక్కడికి వెళ్లి చూశారు. జునైద్ కు తీవ్ర గాయాలు కావడంతో ఇక వెంటనే ఆసుపత్రికి తరలించారు.ఆ బాలుడికి ఛాతి భాగంలో తీవ్ర గాయాలయ్యాయని, తలపైన జుట్టు కూడా కాలిపోయిందని ఆ కుటుంబ సభ్యులు తెలిపారు. ఒక్కసారిగా ఆ ఫోన్ బ్లాస్ట్‌ జరగడంతో జునైద్‌ తీవ్రంగా భయపడ్డాడని తెలిపాడు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి కొంచెం మెరుగవుతోందని, జునైద్ ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు డాక్టర్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: