సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్ (SIM) తయారీలో ఉన్న ఫ్రెంచ్ దిగ్గజం ఐడెమియా(IDEMIA) ఇప్పుడు ఇండియా మార్కెట్పై ఫోకస్ చేసింది.నెక్స్ట్ జనరేషన్ సాంకేతిక పరిజ్ఞానం అయిన ఎంబెడెడ్ సిమ్ల (ఈ-సిమ్) తయారీకి భారత్ను ఇంటర్నేషనల్ హబ్ గా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ కంపెనీకి చెందిన అన్ని ప్లాంట్లు ఏటా 30 కోట్ల ఈ-సిమ్లు ఉత్పత్తి చేయగలవు. ఇక ఇందులో నోయిడా కేంద్రం వాటా మొత్తం 6 కోట్ల యూనిట్లు.ఇక ఈ ఫెసిలిటీని ఈ-సిమ్ల తయారీలో భారీ ప్లాంటుగా నిలపాలన్నది కంపెనీ లక్ష్యం. ఇక ఈ-సిమ్ ప్రత్యేకత ఏంటంటే.. సాధారణ సిమ్కు బదులు సెల్ ఫోన్లో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ కార్డ్ను పొందుపరుస్తారు. ఇక ఈ సిమ్ కస్టమర్లు ఇతర నెట్వర్క్ను ఎంచుకోవాలంటే సిమ్ను మార్చాల్సిన అవసరం లేదు. క్యూఆర్ కోడ్ ఉపయోగించి మరో ఆపరేటర్కు సింపుల్గా మారవచ్చు. ఇక అలాగే ఇతర దేశాలకు వెళ్లినప్పుడు స్థానిక సిమ్ వినియోగించే పని లేదు. అలాగే వేరబుల్స్, వాచెస్ వంటి ఇంటర్నెట్ ఆధారిత ఉపకరణాల్లో ఈ-సిమ్ వల్ల స్థలం అనేది సేవ్ అవుతుంది.
ఇక పరిశోధన, అభవృద్ధికి భారత్లో సుమారు రూ.1,780 కోట్లు వెచ్చించనున్నట్టు ఐడెమియా కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. ఇక వచ్చే అయిదేళ్లపాటు ఈ మొత్తాన్ని ఖర్చు చేయనుంది.అలాగే ‘ఈ-సిమ్ల తయారీలో అతిపెద్ద ప్లాంట్లలో ఒకటిగా ఇండియా నిలవనుంది. ఇక ఇండియాలో ఐడెమియా మాత్రమే వీటిని ఉత్పత్తి చేస్తోంది.ఇక టెలికామ్ రంగంలో ఇక్కడ కొన్నేళ్లుగా పాతుకుపోయిన కారణంగా వీటి తయారీకి ఇండియాని ఎంచుకున్నామని ఐడెమియా ఇండియా రీజినల్ ప్రెసిడెంట్ మాథ్యూ ఫాక్స్టన్ తెలిపారు. కంపెనీ ఏటా 60 కోట్లకుపైగా సిమ్లను ఇండియాలో తయారు చేస్తోంది.కంపెనీ అంతర్జాతీయంగా చేపడుతున్న ఉత్పత్తిలో ఇది 67 శాతం.ఇండియన్ కస్టమర్లకు ఇప్పటి వరకు 100 కోట్లకుపైగా సిమ్లను అందించింది. ఇక ఇండియాలో సిమ్ల మార్కెట్లో ఐడెమియా వాటా 40 శాతం పైమాటే అని చెప్పాలి. ఇక ఆధార్ ప్రాజెక్టులో భాగంగా బయోమెట్రిక్ టెక్నాలజీని సైతం ఈ కంపెనీ అందించింది.