ఇండియన్ క్రికెటర్ మహ్మద్ షమీ గురించి రెండు రకాలుగా పరిచయం చేయాల్సిన పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే!!గతంలో అతడి భార్య హసీనా.. షమీ స్త్రీ లోలుడని, చాలామందితో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం అప్పట్లో పెద్ద సంచలనం అవ్వగా.. షమీ మాత్రం మంచివాడిగా బయటపడ్డాడు. అయితే ఇప్పుడు మరోసారి షమీ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇటు మ్యాచ్ పరంగానూ షమీ గురించి ఆసక్తికర పరిణామం జరిగింది.
సోఫియా అనే మహిళ తాజాగా షమీ గురించి సంచలన ఆరోపణలు చేసింది. షమీ తనతో చాటింగ్ చేశాడని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్కు షమీ చేసిన మెసేజ్ స్క్రీన్ షాట్తో సహా ప్రశ్నించింది. ‘1.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న గొప్ప క్రికెటర్ నాకే ఎందుకు మెసేజ్ చేస్తున్నాడో చెప్పగలరా.?` అంటూ ఆమె ట్వీట్ చేసింది. షమీ తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే కొంతమంది అభిమానులు ఆమెపై తీవ్రంగా మండిపడుతుంటే.. మరికొందరు షమీపై జోక్స్ వేస్తున్నారు. అపరిచిత మహిళకు మెసేజ్ చేసిన మరో వివాదంలో చిక్కుకున్న షమీ ఈ ఘటన నుంచి ఎలా బయటపడతాడో వేచి చూడాల్సిందే.
ఇదిలాఉండగా,న్యూజిలాండ్తో సెమీ ఫైనల్ మ్యాచ్కి షమీని పక్కనబెట్టిన జట్టు మేనేజ్మెంట్, అతని స్థానంలో భువనేశ్వర్ కుమార్కు చోటు కల్పించడం తెలిసిందే. షమీని పక్కనబెట్టడంపై అతని కోచ్ బద్రుద్దిన్ సిద్ధిఖీ అసంతృప్తి వ్యక్తంచేశాడు. సెమీఫైనల్ జట్టులో షమీకి చోటు కల్పించకపోవడం సరైన నిర్ణయం కాదంటూ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, జట్టు మేనేజ్మెంట్పై మండిపడ్డారు. వరల్డ్ కప్లో షమీ 14 వికెట్లు సాధించాడని గుర్తుచేసిన ఆయన…ఫాస్ట్ బౌలర్ నుంచి ఇంతకుమించి ఏమి ఆశించగలమని ప్రశ్నించాడు. ``వరల్డ్ కప్లో ఆడిన 4 మ్యాచ్లలో షమీ 14 వికెట్లు సాధించాడు. ఇందులో ఆఫ్గన్తో మ్యాచ్లో సాధించిన హ్యాట్రిక్ వికెట్లు కూడా ఉన్నాయి. భువనేశ్వర్ బ్యాటింగ్ కూడా చేయగలడని అతడిని ఎంచుకున్నారన్న వాదన నిజమైందేనా?..ఒకవేళ అలా అయితే టాప్ 6 బ్యాట్స్మన్ బాగా ఆడినట్లయితే మిగతా వారితో పనేముంది? అసలు అది సరైన కారణమని ఎవరైనా అపేకుంటారా?`` అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇదిలాఉండగా, న్యూజిలాండ్తో వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్కి మంచి ఫామ్లో ఉన్న ఫేసర్ షమీని తీసుకోకపోవడంపై పలవురు క్రీడారంగ నిపుణులు. సీనియర్ ఆటగాళ్లు సైతం ఆశ్చర్యం వక్తం చేస్తున్నారు. నిన్నటి సెమీ ఫైనల్ మ్యాచ్కి వరుణుడు అడ్డుతగలడంతో మ్యాచ్ నిలిపేసిన విషయం తెలిసిందే. రిజర్వ్ డే ప్రకారం.. ఈరోజు మళ్లీ ఆట ప్రారంభం అయింది.