టీమిండియా 46 పరుగులకే ఆలౌట్.. కెప్టెన్ రోహిత్ రియాక్షన్ ఏంటో తెలుసా?

praveen
గత కొంతకాలం నుంచి టీమిండియా ఎంత అత్యుత్తమమైన ప్రదర్శన చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా ప్రత్యర్థులపై  పూర్తిస్థాయి పైచేయి సాధిస్తూ ఉంది. ఇక విదేశీ పర్యటనకు వెళ్లిన లేదంటే విదేశీ జట్టు భారత పర్యటనకు వచ్చిన కూడా ఇదే స్థాయిలో దూకుడును కనపరుస్తుంది అని చెప్పాలి. అయితే టెస్ట్ ఫార్మట్ లో కూడా టి20 తరహా ఆట తీరుతో అటు ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తుంది భారత జట్టు. అలాంటి టీమ్ ఇండియా ఇక ఇటీవల జరిగిన మ్యాచ్ లో మాత్రం అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. ఇక భారత జట్టు పెర్ఫార్మన్స్ చూసి అభిమానులు సైతం షాక్ లో మునిగిపోయారు.

 ప్రత్యర్థి జట్టుకు కనీస పోటీ ఇవ్వలేక చతికిలబడిపోయింది టీమిండియా. ఎంతలా అంటే ఏకంగా టెస్ట్ ఫార్మాట్లో ఎంతో నిలకడగా ఆడుతూ భారీగా స్కోర్లు చేసే టీమిండియా.. కేవలం 46 పరుగులకే ఆల్ అవుట్ అయిపోయింది  దీంతో ఇది నిజమా కాదా అని నమ్మడానికి కూడా భారత అభిమానులకు కాస్త సమయం పట్టింది. అయితే 92 ఏళ్లలో భారత జట్టు టెస్ట్ ఫార్మాట్లో ఇంత చెత్త ప్రదర్శన చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. జట్టులో ప్రపంచ స్థాయి అత్యుత్తమ బ్యాట్స్మెన్ లు ఉన్న.. ఎవరు ప్రతిభ కనబరచలేకపోయారు.

 ఈ క్రమంలోనే టీమ్ ఇండియా ప్రదర్శన పై కొంతమంది ఆశ్చర్యంలో మునిగిపోతుంటే.. ఇంకొంతమంది మాత్రం తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తూ విమర్శలు గుర్తిస్తున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది అంటూ విమర్శిస్తున్నారు. అయితే ఇక ఇలా 46 పరుగులకు ఆల్ అవుట్ అవ్వడంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. పిచ్ ను తానే తప్పుగా అంచనా వేసినట్లు చెప్పుకొచ్చాడు. పిచ్ ఫ్లాట్ గా ఉంటుందని భావించానని.. సరిగా అర్థం చేసుకోలేకపోయాను అంటూ రోహిత్ తెలిపారు. ఇక కేఎల్ రాహుల్ స్థానాన్ని పదే పదే మార్చడం ఇష్టం లేకనే.. విరాట్ కోహ్లీని ఫస్ట్ డౌన్లో పంపించినట్లు చెప్పుకొచ్చాడు  అయితే జట్టులోని ఆటగాళ్లు కూడా వారి సామర్థ్యానికి తగ్గట్టుగా ప్రదర్శన చేయలేకపోయారు అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: