కాన్పూర్ వేదిక‌గా మిరాకిల్ చేసిన టీమిండియా... బోరుమన్న బంగ్లా!

praveen
కాన్పూర్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న 2వ టెస్టు మ్యాచ్ లో టీమిండియా మాజీ కెప్టెన్, టాలెంటెడ్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించాడు. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఆల్ టైమ్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టేశాడు. వివరాల్లోకి వెళితే... బంగ్లాదేశ్‌తో జరుగుతున్న 2వ టెస్టు తొలి ఇన్నింగ్స్‌ లో 5వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన విరాట్ కోహ్లీ కేవలం 35 బంతుల్లో 1 సిక్స్, 4 ఫోర్లతో 47 పరుగులు చేసి, అంతర్జాతీయ క్రికెట్‌లో 27 వేల పరుగులు విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు.
కట్ చేస్తే, విరాట్ కోహ్లీ కేవలం 594 ఇన్నింగ్స్‌ లలో 27000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. దాంతో ప్రపంచంలోనే 600 కంటే తక్కువ ఇన్నింగ్స్‌ లో ఘనత సాధించిన ఏకైక బ్యాట్స్‌ మెన్‌గా నిలిచాడు. అంతేకాదండోయ్... ఈ ఘనత సాధించిన ప్రపంచంలో 4వ బ్యాటర్‌ కూడా కోహ్లీ కావడం గమనార్హం. సచిన్, విరాట్ తర్వాత శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర 27000+ పరుగులు సాధించారనే విషయం మీకు తెలిసే ఉంటుంది.
ఇకపోతే, గెలుపే లక్ష్యంగా తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా రోహిత్ శర్మ (23), యశస్వి జైస్వాల్ రూపంలో అద్భుతమైన ఆటతీరుని కనబరిచారు. ఫలితంగా 18 బంతుల్లో ఏకంగా 50 పరుగులు సాధించారు. ఆ తర్వాత గిల్‌, జైస్వాల్‌లు కేవలం 10.1 ఓవర్లలోనే జట్టు స్కోరును 100 దాటించారు. 150 పరుగులు పూర్తి చేసేందుకు టీమిండియా 18.2 ఓవర్లు మాత్రమే పట్టడం విశేషం. కాగా, శుభ్‌మన్ గిల్ 39 పరుగులతో ఔట్ కాగా, జైస్వాల్ 51 బంతుల్లో 2 సిక్సర్లు, 12 ఫోర్లతో 72 పరుగులు చేశాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ కూడా దూకుడుగా బ్యాటింగ్ కొనసాగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: