రోడ్ షోలో.. టీమిండియాను భయపెట్టింది ఇతనే?

praveen
దాదాపు 13 ఏళ్ళ నిరీక్షణ తర్వాత టీమ్ ఇండియా ఇటీవల వరల్డ్ కప్ గెలవాలి అనే కలను సహకారం చేసుకుంది అన్న విషయం తెలిసిందే. వెస్టిండీస్, యూఎస్ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ 2024 ఎడిషన్ లో అద్భుతమైన ప్రదర్శన చేసింది భారత జట్టు. ఒక మ్యాచ్ లో కూడా ఓడిపోకుండా ఫైనల్ కు చేరడమే కాదు.. ఇక ఫైనల్ లో కూడా విజయం సాధించి విశ్వవిజేతగా అవతరించింది అన్న విషయం తెలిసిందే. దీంతో టీమ్ ఇండియా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి.

 అయితే ఇలా వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన టీమ్ ఇండియా పై ప్రస్తుతం ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ టీమ్ ఇండియా ప్రదర్శనను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు అని చెప్పాలి. కాగా ఇటీవల వరల్డ్ కప్ ట్రోఫీతో స్వదేశానికి చేరుకుంది  టీమిండియా. కాగా ఇటీవలే ముంబైలోని టీమిండియా ఆటగాళ్లు అందరూ కూడా విక్టరీ పరేడ్ నిర్వహించారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోడ్ షో కి అభిమానులందరూ కూడా భారీగా తరలి వెళ్లారు. సాధారణంగా ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేవుళ్ళ లాగా ఆరాధించే క్రికెటర్లను ఎంతో దగ్గరగా చూడాలని అభిమానులు ఎంతగానో ఆశ పడుతూ ఉంటారు. ఇలాంటి కోరికతోనే కొన్ని కొన్ని సార్లు మైదానంలోకి దూసుకు వెళ్లడం కూడా చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 అయితే ముంబైలో విక్టరీ పరేడ్ రోడ్ షోలో భాగంగా ఒక అభిమాని ఏకంగా టీమ్ ఇండియా క్రికెటర్లను దగ్గర నుంచి చూసేందుకు ఒక ప్రమాదకరమైన విన్యాసమే చేశాడు. రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలో టీమ్ ఇండియా ఆటగాళ్లు ఉన్న వాహనం వెళ్లే దారిలో పక్కనే ఉన్న చెట్టు పైకి ఎక్కాడు. బస్సు చెట్టు దగ్గరికి రాగానే ప్లేయర్లు ఒకసారిగా అతన్ని చూసి భయపడ్డారు. ఇక తాజాగా అతని ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. టి20 వరల్డ్ కప్ లో ఇతర జట్లను వణికించి కప్ సాధించిన భారత ప్లేయర్లను భయపెట్టింది ఇతడే అంటూ నేటిజన్స్ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. టీమిండియా జట్టులోని ఆటగాళ్లు అందరినీ కూడా దగ్గరగా చూసే అవకాశాన్ని కొట్టేసావు అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: