అత్యంత ఖరీదైన ఆటగాళ్ల మధ్య రేపు పోరు... ఎవరిది పై చేయి అవుతుందో..?

Pulgam Srinivas
(ఐ పీ ఎల్) ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే సెమీ ఫైనల్స్ కూడా పూర్తి అయ్యాయి. రేపు అనగా మే 26 వ తేదీన (ఐ పీ ఎల్ 2024) లో భాగంగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ మరియు సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ రేపు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు కు ప్రారంభం కానుంది. ఇక ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఎంతో మంది క్రికెట్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ మ్యాచ్ లో అత్యంత ఖరీదైన ఇద్దరు ఆటగాళ్లు తలపడబోతున్నారు. అసలు విషయంలోకి వెళితే ... ఈ సంవత్సరం వేలం పాటలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కమిన్స్ ను ఏకంగా 20.50 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసుకుంది. ఇక కోల్కతా నైట్ రైడర్ జట్టు స్టార్క్ ను ఏకంగా 24.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసుకుంది. ఈ సీజన్ లో వేరే అత్యంత ఖరీదైన ఆటగాళ్లు ఇలా ఈ సీజన్ లో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు అయినటువంటి ఈ ప్లేయర్స్ రేపు ఫైనల్ మ్యాచ్లో డీ అంటే డీ అనబోతున్నారు.

మరి ఏ జట్టు గెలుస్తుందో ఎవరు ఓడుతారో ఐ పీ ఎల్ 2024 ట్రోఫీ ని ఎవరు ఎగరేసుకు వెళ్తారు తెలియాలి అంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే. ఇకపోతే ఈ సీజన్ లో పాయింట్లు పట్టికలో కోల్కతా నైట్ రైడర్స్ మొదటి స్థానంలో ఉండగా సన్రైజర్స్ హైదరాబాద్ రెండవ స్థానంలో ఉంది. ఇక చివరకు పాయింట్ల పట్టికలో మొదటి రెండవ స్థానాలలో ఉన్న ఈ రెండు జట్లే ఫైనల్ కు వచ్చాయి మరి ఇందులో ఎవరు గెలుస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ipl

సంబంధిత వార్తలు: