ఓడినా పర్లేదు.. అందరికి ధోని కావాలంతే : సెహ్వాగ్

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీ లో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి కొత్త సారధితో బలిలోకి దిగింది. ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఋతురాజ్ ఇక ఇప్పుడు ఆ జట్టుకు సారథిగా వ్యవహరిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక అతనికి కెప్టెన్సీలో పరవాలేదు అనిపిస్తుంది చెన్నై సూపర్ కింగ్స్. ప్లే ఆఫ్ లో అడుగు పెట్టేలాగే కనిపిస్తుంది. అయితే ఇటీవల గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో ఏకంగా 35 పరుగుల తేడాతో చెన్నై జట్టు ఓడిపోయింది అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయినప్పటికీ ఆ జట్టు అభిమానులు మాత్రం ఎక్కడ నిరాశ పడలేదు. దీనికి కారణం అభిమానులందరికీ కావాల్సిన ధోని బ్యాటింగ్ చూశారు కాబట్టి. చివర్లో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన ధోని 11 పంతులు 26 పరుగులు చేశాడు. అందులో ఒక ఫోర్ మూడు సిక్సర్లు ఉండడం గమనార్హం. మ్యాచ్ ఓడిపోతామని తెలిసినా ధోని బ్యాటింగ్ తో అభిమానులు అందరూ కూడా చివరి వరకు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇదే విషయం గురించి భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక నుంచి మనం ధోని బ్యాటింగ్ స్థానంపై చర్చలు ఆపేయాలి.

 అతను ఏం చేయాలనుకుంటున్నాడు అనే విషయంపై పూర్తి అవగాహన ఉంది. ఎలా ఆడాలి అన్నది అతడి ఇష్టం. ఒకవేళ మీరు చెన్నై గెలవాలని కోరుకుంటే మాత్రం ఇప్పుడు ధోని ఆడుతున్న స్ట్రైక్ రేటుతో జట్టులోని మిగతా ప్లేయర్ లందరూ కూడా ఆడాలి. అప్పుడు సులువుగా చెన్నై గెలుస్తుంది. మ్యాచ్ను చూడటానికి వచ్చే అభిమానులు టికెట్ కొనుగోలు చేసిన మొత్తానికి ఎంటర్టైన్మెంట్ దొరికినట్లే. మైదానం నలువైపులా భారీ షాట్లతో విరుచుకుపడుతూ బౌండరీల వర్షం కురిపిస్తున్నాడు ధోని. తమ జట్టు విజయం సాధించిన ఓడిపోయిన వారికి అవసరం లేదు. ధోని బాగా ఆడితే చాలు. ప్రేక్షకులు దీనిని చూసేందుకే వస్తున్నారు. ఇక ధోని కూడా అభిమానులను ఎంటర్టైన్ చేయించేందుకు ఆడుతున్నాడు అంటూ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: