ఐపీఎల్ : నేడు రాజస్థాన్ vs పంజాబ్.. గెలుపు ఎవరిది?
ఎందుకంటే ఎప్పుడు ఏ టీం విజయం సాధిస్తుంది అనే విషయంపై ఒక క్లారిటీ లేకుండా పోయింది అని చెప్పాలి. చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగుతున్న మ్యాచ్ లో అనూహ్యమైన విజయాలు నమోదవుతున్నాయి. అయితే ఇప్పుడు ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా నేడు మరో ఆసక్తికరమైన మ్యాచ్ జరగబోతుంది. పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడబోతున్నాయి. చండీగఢ్ లోని ముల్లంపూర్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతూ ఉండడం గమనార్హం. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
అయితే పంజాబ్ రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ టీమ్స్ మధ్య గత గణాంకాలు ఎలా ఉన్నాయి అన్న విషయం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే టోర్నమెంట్ చరిత్రలో ఇప్పటివరకు ఈ రెండు టీమ్స్ కూడా 26 మ్యాచ్లలో తలబడ్డాయి. రాజస్థాన్ రాయల్స్ జట్టు 15 మ్యాచ్లో విజయం సాధిస్తే అటు పంజాబ్ కింగ్స్ జట్టు 12 మ్యాచ్ లలో విజయ డంకా మోగించింది. అయితే ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టు 8 పాయింట్లతో టాప్ లో ఉండగా.. మరోవైపు పంజాబ్ కింగ్స్ మాత్రం కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించి నాలుగు పాయింట్లతో ఇక పాయింట్లు పట్టికలో ఎనిమిదవ స్థానంలో కొనసాగుతుంది అయితే ఇక నేడు జరగబోయే మ్యాచ్లో గెలుపు ఎవరిది అనే విషయంపై ఆసక్తి నెలకొంది.