వారితో.. నేను కలిసి ఉండలేను : రోహిత్ శర్మ

praveen
ప్రస్తుతం టీమిండియా కు మూడు ఫార్మాట్లలో కూడా కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ గత కొంతకాలం నుంచి వార్తల్లో తెగ హాట్ టాపిక్ లో మారిపోతున్నాడు అన్న విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ గా మోస్ట్ సక్సెస్ఫుల్ సారథిగా కొనసాగిన రోహిత్ శర్మ ను ఇటీవల ఆ జట్టు యాజమాన్యం సారధ్య బాధ్యతల నుంచి తప్పించింది అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే అతన్ని కెప్టెన్సీ నుంచి అర్ధాంతరంగా తప్పించడం అన్యాయం అంటూ ఎంతోమంది క్రికెట్ అభిమానులు అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అతన్ని స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న హార్థిక్ పాండ్యా.. సారథిగా సక్సెస్ కాలేకపోతున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టుకు విజయాలను అందించలేకపోతున్నారు అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఇక ముంబై ఇండియన్స్ యాజమాన్యం తీసుకున్న కెప్టెన్సీ మార్పు నిర్ణయం పై మరింత తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయితే ఇలాంటి విమర్శలు మధ్య ఇటీవల రోహిత్ శర్మ చేసిన కామెంట్స్ మాత్రం ఫైనల్ గా మారిపోయాయి అని చెప్పాలి. తాను కొంతమందితో కలిసి ఉండలేను అంటూ ఇటీవల రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

 దీంతో ఇక రోహిత్ కెప్టెన్సీ మార్పు గురించే మాట్లాడాడు అని అందరూ అనుకుంటున్నారు. కానీ మరో విషయంపై రోహిత్ ఇలాంటి కామెంట్లు చేశాడు.  కపిల్ శర్మ షోలో రోహిత్ సరదాగా స్పందించాడు. దావన్, పంత్ లతో కలిసి అస్సలు ఉండలేను. ఎందుకంటే వారు గదిని మురికిగా ఉంచుతారు. ప్రాక్టీస్ అవ్వగానే దుస్తులు మంచంపై పడేస్తారు. మధ్యాహ్నం వరకు నిద్రపోతారు. ఇక డోర్ పై డిస్టర్బ్ చేయవద్దు అనే ఒక నోటీస్ రాసి ఉంటుంది. దీంతో గదిని శుభ్రం చేసే సిబ్బంది కూడా తలుపు తెరవరు. దీంతో ఇక గదులు చిందరవందరగా ఉంటాయి. అందుకే వారితో కలిసి అస్సలు ఉండలేను అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: