ముంబై తో మ్యాచ్ కి ముందు.. ఢిల్లీ క్యాపిటల్స్ కి బిగ్ షాక్?

praveen
ప్రస్తుతం ఐపీఎల్ ప్రారంభమైంది. ఇక ప్రేక్షకులందరికీ కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందుతుంది. అయితే ఇక ఐపీఎల్ లో కొన్ని టీమ్స్ ఏకంగా అంచనాలకు మించి రాణిస్తూ ఉంటే మరికొన్ని జట్లు మాత్రం ఎందుకో అంచనాలు అందుకోలేక తీవ్రంగా నిరాశ పరుస్తూ ఉన్నాయి. ఇలా నిరాశ పరుస్తున్న టీమ్స్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఒకటి. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందు నుంచే అటు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శన పై అందరికి దృష్టి ఉంది. ఎందుకంటే దాదాపు ఏడాదిన్నర తర్వాత గాయాలనుంచి కోలుకున్న రిషబ్ పంత్ మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరాడు. కెప్టెన్గా బాధ్యతలు చేపట్టి జట్టును ముందుకు నడిపించేందుకు సిద్ధమయ్యాడు.

 అయితే ఐపీఎల్లో భాగంగా ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ లు ఆడింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. అయితే ఒకే ఒక్క మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించింది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతూ చివరికి ఓడిపోతూ వస్తుంది. ఇలా టైటిల్ పోరులో అంతకంతకు వెనుక పడుతూనే ఉంది అని చెప్పాలి  అయితే ఇక నేడు మరో మ్యాచ్ ఆడటానికి ఢిల్లీ క్యాపిటల్స్ సిద్ధమవుతోంది. వాంకడే   స్టేడియం వేదికగా ముంబైతో మ్యాచ్ ఆడబోతుంది అని చెప్పాలి. ఈ మ్యాచ్ లో అయినా గెలిచి పాయింట్ల పట్టికలో పైకి వెళ్లాలి అని అనుకుంటుంది ఢిల్లీ క్యాపిటల్స్. ఇలాంటి సమయంలో అటు ముంబైతో మ్యాచ్ కు ముందు ఢిల్లీ జట్టుకు బిగ్ షాక్ తగిలింది.

 ఏకంగా ఆ జట్టు స్టార్ ప్లేయర్ మిచెల్ మార్ష్ దూరం కానున్నాడు. గాయం కారణంగా  ముంబై ఇండియన్స్ తో జరిగే మ్యాచ్కు అతను అందుబాటులో ఉండడు అన్న విషయాన్ని టీం డైరెక్టర్ సౌరబ్ గంగూలీ తెలిపారు. కానీ అతడు కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే ఇక ఈ సీజన్లో నాలుగు మ్యాచ్లు ఆడిన మిచెల్ మార్ష్ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేదు. కేవలం 71 పరుగులు మాత్రమే చేశాడు. అటు బౌలింగ్ లో కూడా నాలుగు మ్యాచ్లలో కలిపి కేవలం ఒకే ఒక్క వికెట్ మాత్రమే దక్కించుకున్నాడు మార్ష్. అయితే అతని స్థానంలో జట్టులోకి ఎవరు రాబోతున్నారు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: