ఐపీఎల్ టైటిల్ ఫై.. కోహ్లీ కీలక వ్యాఖ్యలు?

praveen
దాదాపు గత 17 ఏళ్ల నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అభిమానులు అందరూ కూడా నిరీక్షణగా ఎదురు చూస్తున్న కల ఇటీవల నెరవేరింది. ఐపీఎల్ లో  బెంగళూరు జట్టు టైటిల్ గెలవక పోయినప్పటికీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో మాత్రం రెండో సీజన్లోనే ఇది సాధ్యమైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్టు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇకపోతే ఇటీవల అటు ఆర్సిబి అన్ బాక్స్ ఈవెంట్ నిర్వహించగా.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో టైటిల్ గెలిచిన ఆర్సిబి ఉమెన్స్ జట్టుకి ఘన స్వాగతం పలికింది మెన్స్ టీం.

 అయితే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో టైటిల్ గెలిచిన ఆర్సిబి ఇక ఈసారి ఐపీఎల్ లో కూడా ఇది రిపీట్ చేస్తుందని అందరూ అనుకుంటున్నారు. కాగా ఇటీవల ఆర్సిబి అన్ బాక్స్ ఈవెంట్ లో మాట్లాడిన విరాట్ కోహ్లీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కప్ గెలిచినప్పుడు మేము మ్యాచ్ చూస్తూనే ఉన్నాం. అప్పుడు బెంగళూరు అభిమానుల ప్రేమను ఫీల్ అయ్యాం. 11 మంది మాత్రమే కాదు బెంగుళూరు మొత్తం కప్పు గెలిచింది అన్నట్లుగా అందరూ సంబరాలు చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఈ సంబరాలను డబుల్ చేసేందుకు మేము సిద్ధమవుతున్నాం అటు విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

 గత పదహారేళ్ళలో తాము ఎప్పుడూ ఇక్కడికి వచ్చిన టైటిల్ గెలవాలని దృఢ సంకల్పంతోనే బరిలోకి దిగాం. అందుకోసం ప్రతిసారి కూడా శాయ శక్తుల కృషి చేస్తూనే ఉన్నాం అంటూ కోహ్లీ తెలిపాడు. ఐపీఎల్ టైటిల్ తొలిసారి గెలిచిన ఆర్సిబి జట్టులో ఉండాలన్నది తన కోరిక. అభిమానులు ఫ్రాంచైజీ అందించిన సహకారాన్ని ఎప్పటికీ మరువలేను. టైటిల్ గెలిచి వీరి రుణాన్ని తీర్చుకుంటా అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇకపోతే ప్రస్తుతం అటు ఆర్సిబి జట్టు ఎంతో పటిష్టంగా ఉంది అని చెప్పాలి. దీంతో ఇక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో  మ్యాజిక్ ఐపీఎల్ లో కూడా క్రియేట్ అవుతుందని అభిమానులు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: