ఐపీఎల్ : ఆ చిచ్చరపిడుగు పైనే అందరి కన్ను?

praveen
ఇండియాలో క్రికెట్ పండుగ మొదలవ్వడానికి ఇంకా ఎంతో సమయం లేదు. ఒక్కరోజు గడిస్తే చాలు ఏకంగా ఐపీఎల్ మొదలవుతుంది. దీంతో ఈ ఐపీఎల్ చూసేందుకు భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఎప్పటిలాగానే ఎంతోమంది స్టార్ ప్లేయర్స్ తో పాటు చాలామంది యువ ఆటగాళ్లు కూడా ఈ ఐపీఎల్ టోర్నిలో బరిలోకి దిగబోతున్నారు. తమ సత్తా ఏంటో నిరూపించుకునేందుకు రెడీ అవుతున్నారు అని చెప్పాలి. అన్ని టీమ్స్ కూడా టైటిల్ గెలవడమే లక్ష్యంగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి.

 అయితే ఇక మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభం కాబోతూ ఉండగా.. అందరి కన్ను మాత్రం ఒక యువ ఆటగాడి పైనే ఉంది. అతను ఎవరో కాదు ప్రస్తుతం ఇండియన్ క్రికెట్లో యంగ్ సెన్సేషన్ గా కొనసాగుతున్న యశస్వి జైశ్వాల్. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ తరఫున అతను ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. అయితే జట్టు ప్రస్థానం ఎలా ఉన్నప్పటికీ.. అతని ప్రదర్శన మాత్రం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఏకంగా బ్యాటింగ్ తో విధ్వంసం అంటే ఎలా ఉంటుందో చూపించి.. గత ఏడాది ఐపీఎల్ సీజన్లో 625 పరుగులు చేశాడు యశశ్వి. అటు టీమిండియాలో కూడా చాన్సును తగ్గించుకున్నాడు. ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో వరుసగా రెండు డబుల్ సెంచరీలు చేసి అదరగొట్టాడు అని చెప్పాలి.

 ఇలా వచ్చిన ఏ ఒక్క ఛాన్స్ ని కూడా వదులుకోవడం లేదు ఈ యువ ఆటగాడు. దీంతో ఇక ఈ ఐపీఎల్ సీజన్లో అతని విధ్వంసం ఎలా ఉంటుందో అనే విషయంపైనే అందరి దృష్టి ఉంది. కాగా ప్రస్తుతం ఈ చిచ్చరు పిడుగు మెగా టోర్నీ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు. నెట్స్ లో భారీ సిక్సర్లు బాదుతూ ఇక ప్రాక్టీస్ తోనే ప్రత్యర్ధులకు హెచ్చరికలు పంపుతున్నాడు. ప్రస్తుతం జైష్వాల్ ఉన్న ఫామ్ చూస్తే ఈ ఐపిఎల్ సీజన్లో అతని అత్యధిక పరుగుల వీరుడుగా నిలుస్తాడేమో అని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: