రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించి.. మంచి పని చేశారు : ఫించ్

praveen
మరికొన్ని రోజుల్లో ఇండియాలో ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాబోతుంది. ఐపీఎల్ ప్రారంభమైందంటే చాలు దేశవ్యాప్తంగా క్రికెట్ పండగ మొదలవుతుంది అని చెప్పాలి. అసలు సిసలైన క్రికెట్ ఎంటర్టైన్మెంట్ ని పొందుతూ ప్రేక్షకులు అందరూ కూడా తెగ ఆనంద పడిపోతూ ఉంటారు. మార్చ్ 22వ తేదీన జరగబోయే చెన్నై, బెంగళూరు మ్యాచ్ ద్వారా ఐపీఎల్ ప్రారంభం అవుతుంది అని చెప్పాలి  అయితే ఇప్పుడు అన్ని జట్లు కూడా పక్క ప్రణాళికలతో ఈ ఐపీఎల్ సీజన్లో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి.

 కాగా ఐపీఎల్ 17వ సీజన్లో ఎవరు విజేతగా నిలుస్తారు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఒక విషయంపై మాత్రం ఇంకా చర్చ ఆగడం లేదు. అదే ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మను ఆ జట్టు యాజమాని అర్ధంతరంగా సారధ్య బాధ్యతలు నుంచి తప్పించడం.. ఇలా రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు ఆ బాధ్యతలను అప్పగించింది ఫ్రాంచైజీ. దీంతో రోహిత్ అభిమానులు ఈ విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ విషయంపై ఎప్పుడు ఏదో ఒక పోస్ట్ ప్రత్యక్షమవుతూనే ఉంది. ఇక ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా ఇదే విషయంపై స్పందిస్తున్నారు.

 కాగా ఇటీవల ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఫించ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబై కెప్టెన్ గా రోహిత్ శర్మ తొలగింపు జట్టుకు ఒకరకంగా మంచిదే అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కెప్టెన్సీ భారం భుజాలపై లేకపోవడంతో రోహిత్ శర్మ మరింత స్వేచ్ఛగా ఆడి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఎక్కడికి వెళ్లినా జట్టు గురించి ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు రోహిత్ కు లేదు. ఓపెనర్ గా బరిలోకి దిగి భారీగా పరుగులు చేయడం మాత్రమే ఇక ఇప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ చేయాల్సిన పని అంటూ ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ ఆరోన్ పించ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: