చెన్నై అంటే ధోనీనే.. అంబటి రాయుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత క్రికెట్లో ఎంతోమంది స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ఇక ధోని మాత్రం తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అని చెప్పాలి. తన ఆట తీరుతోనే కాదు తన కెప్టెన్సీ తో కూడా వరల్డ్ క్రికెట్లో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రణ వేసుకున్నాడు. 2019లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్రసింగ్ ధోని.. అటు ఐపీఎల్ కెరియర్ ను   మాత్రం కొనసాగిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు అనే విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే గత కొన్ని ఐపిఎల్ సీజన్స్ నుంచి కూడా మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అంటూ ప్రచారం జరుగుతూ వస్తుంది. కానీ అటు ధోని మాత్రం వరుసగా ఐపీఎల్లో ఆడుతూనే వస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు 2024 ఐపిఎల్ సీజన్లో ఆడేందుకు కూడా సిద్ధమవుతున్నారు ధోని. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కాబోతూ ఉండగా   ఇక ధోని కెప్టెన్సీ గురించి ధోని కెప్టెన్సీ లో చెన్నై సూపర్ కింగ్స్ ఛాంపియన్గా నిలవడం గురించి.. ఎంతోమంది  మాట్లాడుతూ ఇక మహేంద్ర సింగ్ ధోనీ పై ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెప్పాలి.

 అయితే గత ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ విజేతగా నిలవగా.. ఇక అదే సమయంలో ఇక ఐపీఎల్ కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ అంబటి రాయుడు సైతం ఇటీవల మహేంద్రసింగ్ ధోనీ పై ప్రశంసలు కురిపించాడు. చెన్నై సూపర్ కింగ్స్ అంటే ధోనియే అంటూ వ్యాఖ్యానించాడు రాయుడు. సీఎస్కే జట్టును కలిపి ఉంచేది ధోని.. డ్రెస్సింగ్ రూమ్ అయినా ఫాన్స్ అయినా అందరం ఒకటే. కుటుంబం అనే భావన తన వల్లే కలుగుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ లో ఉండే ఆటగాళ్లకు ఇంట్లో ఉన్నట్లు సౌకర్యంగా అనిపిస్తుంది  ప్రపంచవ్యాప్తంగా ఉన్న సీఎస్కే అభిమానులు అందరూ కూడా ముందుగా ధోని అభిమానులు అంటూ అంబటి రాయుడు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: